బండి సంజయ్ పై పోలీసు కేసు!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై కేసు నమోదైంది. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో కరోనా లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపైన కేసు నమోదయ్యింది. అయితే లాక్‌ డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉన్న భౌతిక దూరాన్ని పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌ తో పాటు పలువురిపై 188 సెక్షన్‌ క్రింద కేసులు నమోదు చేశారు. రికార్డు స్థాయిలో బత్తాయి పండించే […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 9:50 am
Follow us on

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై కేసు నమోదైంది. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో కరోనా లాక్‌ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపైన కేసు నమోదయ్యింది. అయితే లాక్‌ డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉన్న భౌతిక దూరాన్ని పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌ తో పాటు పలువురిపై 188 సెక్షన్‌ క్రింద కేసులు నమోదు చేశారు. రికార్డు స్థాయిలో బత్తాయి పండించే నల్లగొండ జిల్లాలో సంజయ్ పర్యటించారు. అందులో భాగంగానే పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను బండి సంజయ్ పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు.‌