Political Panchangam In Andhra Pradesh: ఉగాది పంచాంగ శ్రవణం అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఏడాదిలో జరిగే మంచి చెడులను చెబుతుంది. ఎన్నో శుభాలను తీసుకొస్తుంది. అయితే దురదృష్టం కొద్దీ ఈ పంచాంగానికి సైతం రాజకీయ మరక అంటుకుంది. గత కొంతకాలంగా పంచాంగం అనగానే.. అది ఏ పంచాంగం? టిడిపి పంచాంగమా? లేకుంటే వైసిపి పంచాంగమా? ఇంకో పార్టీ పంచాంగమా? అని అడిగే పరిస్థితికి వచ్చింది. జ్యోతిష్యం పరమ పవిత్రం. దానిని నువ్వు శాస్త్రంగా చెబుతారు. కానీ ఇప్పుడు అది రాజకీయం అయిపోయింది. పార్టీలకు అనుకూలంగా జాతకాలు మారిపోతున్నాయి. టిడిపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగితే అందుకు తగ్గట్టు పంచాంగం రాసుకున్నారు పండితులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోలా పంచాంగం రాస్తున్నారు. అయితే వీరిని పండితులు అనాలో.. రాజకీయ పండితులు అనాలో తెలియడం లేదు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
* ఒకేలా ఉంటేనే విలువ..
ఏ పార్టీ కార్యాలయంలో జరిగినా.. ఇతర చోట్ల జరిగినా పంచాంగ శ్రవణం ఒకేలా ఉంటే దానికి విలువ. పంచాంగాన్ని చదివే పండితుడికీ ఒక విలువ ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీకి పరిస్థితులు అనుకూలం అని ఒకరు.. ఇక తిరుగులేదు రాజయోగమే అంటూ మరొకరు.. ఇలా ఎవరికి వారు రాజకీయ పంచాంగాలు చెబుతున్నారు. రాజకీయ పంచాంగాలు కాదు ఉగాదినాడు.. నాయకులను ఉద్దేశించి పెద్ద పెద్ద పద్యాలు పాడుతున్న పండితులు ఉన్నారు. అయితే ఈ రాజకీయ పంచాంగ శ్రవణం పుణ్యమా అని.. నిజమైన పాండిత్యంతో చెప్పే పంచాంగాలకు సైతం నమ్మే పరిస్థితి లేదు.
* నమ్మని ప్రజలు..
రాజకీయ పంచాంగాల విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాటిని నమ్మేస్థితిలో కూడా లేరు. హిందూ సమాజం కూడా ఈ రాజకీయ పంచాంగాల పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది. బహుశా ఈ సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు. అందుకే ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజకీయ పంచాంగాలు సాధారణంగా ఉంటాయని అనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా పొలిటికల్ పంచాంగ శ్రవణాలను వినడమే మానేశారు ప్రజలు. కానీ ఎవరి డప్పు వారు కొట్టండి రా అన్నట్టు సొంత పార్టీ శ్రేణులను ఆకట్టుకునేందుకే ఈ పొలిటికల్ పంచాంగ శ్రవణాలు కొనసాగుతున్నాయి.
