Homeజాతీయ వార్తలుDelhi: వాయు కాలుష్యం.. వాటర్‌ సమస్య.. ఢిల్లీవాసుల ఉక్కిరిబిక్కిరి!

Delhi: వాయు కాలుష్యం.. వాటర్‌ సమస్య.. ఢిల్లీవాసుల ఉక్కిరిబిక్కిరి!

Delhi: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు దీపావళి పండుగ వేళ.. సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కరి చేస్తోంది. ఇంకోవైపు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో టపాసులు కాల్చడాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. కాలుష్య నియంత్రణక చర్యలు చేపట్టింది. కానీ, గాలి నాణ్యత పడిపోతూనే ఉంది. ఊపిరి తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గాలి నాణ్యత (ఏక్యూఐ) 400గా నమోదైంది. ఇక తాజాగా నీటి సమస్య తలెత్తింది. అక్టోబర్‌ 31 వరకు నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్‌ బోర్డు ప్రకటించింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

నీటి ఎద్దడి..
అక్టోబర్‌ 31 వరకు ఢిల్లీలోని 60కిపైగా ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోతుందని ఢిల్లీ జల్‌బోర్డు తెలిపింది. నగరానికి పలు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్‌ ప్రాంటకు నీరు ప్రధానంగా గంగా కెనాల్‌ నుంచి వస్తుంది. అయితే యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్‌ 12 నుంచి 31 వరకు మెయింటనెన్స్, మరమ్మతులు చేస్తోంది. దీంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్లాంట్లు మూసివేశారు. ఇక ఢిల్లీలోని యమునా నదిలో అమ్మెనియా స్థాయి ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు యమునా నీటిని సరఫరా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలక ఇబ్బందలు ఎదురవుతుఆన్నయి. దీంతో ఢిల్లీ అంతటా నీటిఎద్దడి నెలకొంది. అత్యవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లతో ప్రభుత్వం నీరు సరఫరా చేయిస్తోంది.

ఊపిరి ఆడని ఢిల్లీ..
ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా రోజు రోజుకూ తీవ్రం అంవుతోంది. పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌ నుంచి వస్తున్న వ్యర్థాల పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. దీనికితోడు పొగమంచు కూడా దేశ రాజధాని వాసులను ఇబ్బంది పెడుతోంది. నగర ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ డేంజర్‌ స్థాయికి పడిపోయింది. సోమవారం(అక్టోబర్‌ 28న) ఏక్యూ 328గా నమోదైంది. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంంలో గాలి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉదయం 7 గంటలకు 357గా ఏక్యూఐ ఉంది. అక్షర్‌ధామ్‌ ఆలయవ వద్ద కూడా ఇదే పరిస్థితి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version