spot_img
Homeఆంధ్రప్రదేశ్‌గుంటూరు హత్యల మిస్టరీ.. కారణాలేంటి?

గుంటూరు హత్యల మిస్టరీ.. కారణాలేంటి?

Six migrant workers deadతెల్లవారే సరికే వారి ప్రాణాలు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వేల కిలోమీటర్లు వలస వచ్చిన కూలీలు మంటల్లో కాలిబూడిదయ్యారు. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు రేకుల షెడ్డు మీద పడడంతో విగతజీవులయ్యారు. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవదహనమయ్యారు. రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన వ్యక్తులు కాపలాకు కుదిరారు. గురువారం అంతా రొయ్యల చెరువు వద్ద ఉన్న రేకుల షెడ్లులో నిద్ర పోయారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నాక కరెంటు తీగలు రేకుల షెడ్డు మీద పడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు ఏంటో ఇంతవరకు తెలియరాలేదు.

అయితే ఘటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుదాఘాతం అని పోలీసులు చెబుతున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. విద్యుత్ సిబ్బంది మాత్రం అది షార్ట్ సర్క్యూట్ కారణం కాదని చెబుతున్నారు. మరి వారి మృతికి కారణాలేంటి అనే కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘటనా స్థలానికి మీడియాను ఎందుకు అనుమతించడం లేదు. రేకుల షెడ్డులో రసాయనాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అసలు వారు నిద్రించే గదిలో అవి ఎందుకు ఉన్నాయనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తోంది.

రసాయనాల పేలుడుతోనే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీనిపై రూరల్ ఎస్పీ విశాల్ గన్నీ, బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అయితే బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలోనే కూలీలు ఎందుకు నిద్రించారని ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బ్లీచింగ్ వాసనకు వారికి నిద్ర ఎలా పట్టిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అక్కడ ఆరు గదులుండగా అందరు ఒకే గదిలో ఎందుకు నిద్ర పోయారు? మగవాళ్లు లోపల పడుకుంటే ఆడవాళ్లు బయట ఎందుకు పడుకున్నారు? గదులకు తలుపులు లేకపోయినా వారు ఎందుకు బయటకు రాలేకపోయారు? అది విద్యుదాఘాతమా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు సాగించాల్సిన అవసరం ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version