spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ప్రొద్దుటూరులో ఐపిసి సెక్షన్ కాకుండా వైసిపి సెక్షన్

ప్రొద్దుటూరులో ఐపిసి సెక్షన్ కాకుండా వైసిపి సెక్షన్

 

BJP Vishnu Vardhan Reddy

ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూచనల మేరకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిన్న సాయంత్రం బీజేపీ కార్యకర్తలపై దాడి వైసీపీ ఎమ్మెల్యే చేయించినవేనని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేస్తామని విష్ణు స్పష్టం చేశారు. ఎంత మందిని చంపుతావో చంపు, ధైర్యంగా పోరాడుతామన్నారు. ప్రొద్దుటూరులో ఐపిసి సెక్షన్ కాకుండా వైసిపి సెక్షన్ నడుస్తోందన్నారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ కి ఫిర్యాదు చేసామన్నారు.

ఈ బీజేపీ కార్యకర్తలు కొన్ని రోజుల క్రితం వైసిపి నుంచి బీజేపీ లోకి చేరారని, తిరిగి వైసీపీలోకి రావాలని ఒత్తిడికి దిగి ప్రభుత్వం పథకాలు రానివ్వకుండా చేశారని విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలపై ఉన్నతాధికారులికి ఫిర్యాదు చేయడంతో స్థానిక వలంటీర్ తొ కలిసి బీజేపీ కార్యకర్తల పై దారుణంగా దాడులు చేయించారని మండిపడ్డారు. ఈ దాడుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. కడప రిమ్స్ హాస్పిటల్ లో వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణకు పాల్పడ్డ వారిపై ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోగా తిరిగి బాధితుల పై కేస్ పెట్టడం దారుణమని విష్ణు ఆక్షేపించారు.

నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన కొన్ని గంటల్లోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరగడం దారుణమని విష్ణు అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బెదిరింపులు కు దిగిన కొన్ని గంటల్లోనే ఎవరో ఒకరిపై దాడులు, హత్య జరుగుతుందని.. ఇదంతా పథకం ప్రకారమే చేస్తున్నారన్నారు. నందం సుబ్బయ్య హత్య కూడా ఇలాగే జరిగిందన్నారు. దీనిపై ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ఒక వీధి రౌడీ లాగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి భయపడి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలంగాణకి వెళ్లిపోయాడని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? ఎమ్మెల్యే రాజ్యాంగం లో నడుస్తుందా? అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో బీజేపీ కార్యకర్తలు పై జరిగిన దాడిపై నిస్పక్షపాతంగా విచారణ జరిగి బాధితులకు న్యాయం చేయాలని విష్ణు డిమాండ్ చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version