Theft: పోలీసులకు షాక్: బిర్యానీ, చిప్స్ కోసం 13 ఏళ్ల బాలుడు ఏం చేస్తున్నాడంటే?

Theft: చిరు ప్రాయం.. చేస్తున్న నేరం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది . పదమూడేళ్ల బాలుడు (13-year-old Boy) తన చేతికి పని చెబుతూ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇళ్లలో దొంగతనం(Theft) చేస్తూ జల్సాలు చేస్తున్నాడు. పసిప్రాయమైనా పెద్దవారిని తలపిస్తూ చోరకళలో ఆరితేరాడు. ఒక్కసారి పట్టుబడితే బాలనేరస్తుల పాఠశాలలో వేసినా అతని తీరు మారలేదు. విడుదలైన తరువాత మళ్లీ పాత కథే. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇదేమని అడిగితే అప్పనంగా డబ్బు సంపాదించే మార్గం ఇదొక్కటే అని […]

Written By: Srinivas, Updated On : August 24, 2021 1:19 pm
Follow us on

Theft: చిరు ప్రాయం.. చేస్తున్న నేరం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది . పదమూడేళ్ల బాలుడు (13-year-old Boy) తన చేతికి పని చెబుతూ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇళ్లలో దొంగతనం(Theft) చేస్తూ జల్సాలు చేస్తున్నాడు. పసిప్రాయమైనా పెద్దవారిని తలపిస్తూ చోరకళలో ఆరితేరాడు. ఒక్కసారి పట్టుబడితే బాలనేరస్తుల పాఠశాలలో వేసినా అతని తీరు మారలేదు. విడుదలైన తరువాత మళ్లీ పాత కథే. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇదేమని అడిగితే అప్పనంగా డబ్బు సంపాదించే మార్గం ఇదొక్కటే అని చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో దొంగగా మారి కేసుల్లో ఇరుక్కుంటున్నాడు.

బీహార్ కు చెందిన కూలి పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు అంజనాద్రి నగర్ లో నివాసం ఉంటున్నాడు స్థానికంగా శనివారం ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇనుపరాడ్డుతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60 వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4 వేలు, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

బిర్యానీ, చిరుతిళ్లకు అలవాటుపడి సునాయాసంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడ్డాడు. గతంలోనూ అతడిని అదుపులోకి తీసుకుని బాలనేరస్తుల హోమ్ కు తరలించగా విడుదలైన తరువాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ వెల్లడించారు.

ఆ బాలుడి వయసు 13 ఏళ్లు. కానీ అతడిపై ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనే 10 కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అజనాద్రినగర్ లో చోరీకి పాల్పడడంతో అరెస్టు చేశారు. విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆరు నెలల కాలంలోనే హయత్ నగర్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్నట్లు హయత్ నగర్ సీఐ సురేందర్ గౌడ్ తెలిపారు.