ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలో జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. ఇప్పటికే పలు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు సిద్దమవుతుండగా.. తాజాగా మరో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తానంటూ రాబోతోంది. అదే శంకర్ – రామ్ చరన్ – దిల్ రాజు కాంబోలో రాబోతున్న మూవీ. దిల్ బ్యానర్లో 50వ సినిమాగా.. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. అనౌన్స్ మెంట్ తోనే క్యూరియాసిటీ పెంచేసింది. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే విషయమై పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి.
Also Read: టీజర్ టాక్: లవర్ ఆనందం కోసం ‘పాగల్’ అయ్యాడు
అంతేకాదు.. ఈ సినిమా బడ్జెట్ పైనా ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. దిల్ రాజు హాఫ్ సెంచరీ సినిమా కావడంతో.. ఆ స్థాయికి తగ్గట్టుగా భారీ ఖర్చుచేయడానికి సిద్ధమయ్యాడు. ఇక, శంకర్ సినిమా అంటే ఎంత భారీ తనం ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. బడ్జెట్ ప్లాన్ చేసుకున్న దానికన్నా ఒక రూపాయి ఎక్కువే ఖర్చే చేస్తాడనే పేరుంది శంకర్ కు. దీంతో.. రాబోయే సినిమాకు ఎంత బడ్జెట్ నిర్ణయిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే.. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం.. ఈ సినిమాను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట. సుమారు 150కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉండొచ్చని వినిపిస్తోంది. ఇక, ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందని అంటున్నారు. లక్కీ గాళ్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నను ఫిక్స్ చేసినట్లు టాక్.
Also Read: జబర్దస్త్ ఆర్టిస్టుకు ఎన్టీఆర్ దండం.. వైరల్ అవుతున్న వీడియో!
మరి, వాస్తవంగానే రష్మిక మందన్నను తీసుకున్నారా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. అయితే.. రష్మికను ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటే మాత్రం.. ఆమె రేంజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ అమ్మడి రెమ్యునరేషన్ రూ.2 కోట్లకు చేరిందనే ప్రచారం సాగుతోంది. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని ప్రకటించింది రష్మిక. ఈ సినిమాలోకి రష్మికను తీసుకుంటే.. ఇది గనక హిట్ అయితే.. ఈ అమ్మడి రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం అంటున్నారు. మరి, చూడాలి.. ఏం జరుగుతుందో..?
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్