HomeతెలంగాణJournalist Mahender : కబళిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. రోజుకు రూ.1.20 లక్షల ఇంజెక్షన్స్‌.. జర్నలిస్ట్‌ నరకయాతన.....

Journalist Mahender : కబళిస్తున్న వైరల్‌ ఫీవర్‌.. రోజుకు రూ.1.20 లక్షల ఇంజెక్షన్స్‌.. జర్నలిస్ట్‌ నరకయాతన.. ఆదుకునేవారేరి?

Journalist Mahender : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలతోపాటు వ్యాధులు ముసురుకుంటున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా వైరల్‌ ఫీవర్లు నమోదవుతున్నాయి. డెంగీ, చికున్‌గన్యా, టైఫాయిడ్, మలేరియా లాంటి కేసులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదే సమయంలో జ్వరంతో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రతీ జిల్లాలో కనీసం రెండు మూడు మరణాలు చోటుచేసుకున్నాయి.. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. జ్వరబాధితులను గుర్తించి చికిత్స చేస్తోంది. అత్యవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఇలా జ్వరాల కట్టడికి ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా, కొన్ని జ్వరాలు అకస్మాత్తుగా కబళిస్తున్నాయి. మంచం పట్టేలా చేస్తున్నాయి. డెంగీ, చికున్‌ గన్యాతో మరణాలు సంభవించడమే కాకుండా వైరల్‌ ఫీవర్లు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుస్తున్నాయి. తాజాగా ఓ జర్నలిస్టు వైరల్‌ ఫీవర్‌ బారిన పడి మంచం పట్టాడు. ప్రాణాపాయ స్థితికి చేరాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరి కదలలేని పరిస్థితి నెలకొంది. సాదా సీదా జర్నలిస్టుగా జీవనం సాగిస్తున్న ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే. అతన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని జర్నలిస్టు సంఘాల నేతలు కోరుతున్నారు.

సాక్షి రిపోర్టర్‌..
కరీంనగర్‌ జిల్లాలో సాక్షి దిన పత్రికలో స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున మహేందర్‌.. దీనావస్థ తెలుసుకుని అందరూ చలించిపోతున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహేందర్‌ వైరల్‌ ఫీవర్‌బారిన పడగా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరడంతో అతని అరికాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి. మహేందర్‌ సాధారణ పరిస్థితికి రావాలంటే రోజుకు రూ.2 లక్షల విలువ చేసే ఆరు ఇంజక్షన్లు ఏడు వారాలు ఇవ్వాలని వైద్యులు తెలిపారు. అంటే రోజుకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. ఇతర వైద్య పరీక్షలు, చికిత్స కోసం మొత్తం కలిసి రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సగటు జీవితం గడుపుతున్న మహేందర్‌ కుటుంబానికి అంత ఖరీదైన చికిత్స చేయించే పరిస్థితి లేదు. దీంతో మహేందర్‌ను ఆదుకునేందుకు జర్నలిస్టు సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి.

ముందుకు వస్తున్న సహచరులు..
మహేందర్‌ ప్రాణాలు కాపాడేందుకు క్రీడాకారులు, జర్నలిస్తు మిత్రులు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. తమవంతుగా ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇదే సమయంలో జర్నలిస్టులు ఫండ్‌ రైసింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహేందర్‌ కోసం 8688117162 నంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్‌ పే ద్వారా డబ్బులు పంపించాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియాతోపాటు, రాజకీయ నాయకులు, ప్రజాప్రనిధులను కలిసి విన్నవిస్తున్నారు. దీంతో చాలా మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా ఆర్థికసాయం అందితే మహేందర్‌కు త్వరగా వైద్యం అందితే కోలుకునే అవకాశం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version