బిజెపి వలలోకే వెళ్లిన ఎమ్యెల్యేలలో చాలామంది తిరిగి వచ్చేసారని, ఇంకా ఇద్దరు మాత్రమే కర్ణాటకలో బిజెపి `ఆతిధ్యం’లో ఉన్నరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అదృశ్యమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరి జాడ మాత్రం తెలియడం లేదు. ఆదివారం తిరిగి వచ్చిన బిసాహులాల్తో మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆ రాష్ట్ర హోం మంత్రి బాలా బచ్చన్ ఆదివారం ప్రకటించడంతో బిజెపి శిబిరంలో ఉత్సాహం ఆవిరైపోయింది.
ఈ లోగా కొద్దిమంది బిజెపి ఎమ్యెల్యేలను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి కమల్నాథ్ చేస్తున్న ప్రయత్నాలు బిజెపి వర్గాలలో అలజడి రేపుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఒక ఎమ్యెల్యే అయితే బహిరంగంగానే బిజెపి నాయకత్వంపై దాడి చేశారు.