ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి రెండో దశ సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేడు జరిగే టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్లో భాగంగా టీమిండియా తరుపున కేఎల్ రాహుల్, ధావన్ బరిలోకి దిగారు. మూడు మ్యాచ్ లు జరిగే ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ క్యాన్ బెర్రాలోని మనుకా స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాగా రెండో మ్యాచ్ 6న, మూడో మ్యాచ్ 8న జరగనుంది. మొన్నటి వరకు జరిగిన సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా ఈ సిరీస్ ను ఎలాగైగా గెలవాలని బరిలోకి దిగింది. ఈ సిరీస్ లో భారత్ స్వల్ప మార్పలు చేసింది. జట్టులో కొత్తగా నటరాజన్ ప్రవేశించాడు. అలాగే మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్డన్ సుందర్, దీపక్ చహర్లకూ చోటు దక్కింది.