Trivikram Mahesh Movie: త్రివిక్రమ్ తో మహేష్ కి గొడవలు… క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత!

సూర్యదేవర నాగవంశీ ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఆయన రాగానే నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే సూచనలు కలవు. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Written By: Shiva, Updated On : April 27, 2023 1:03 pm
Follow us on

Trivikram Mahesh Movie: మహేష్-త్రివిక్రమ్ మూవీపై పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. పవన్ కళ్యాణ్ చిత్రాలతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మహేష్ మూవీని పట్టించుకోవడం లేదన్న మాట వినిపించింది. ఒక దశలో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యాక మధ్యలో ఆపేశారన్నారు. మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేశారని కూడా రూమర్స్ వినిపించాయి. తాజాగా మహేష్-త్రివిక్రమ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాయడం జరిగింది.

ఈ రూమర్స్ మీద నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఆయన రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న మీడియా సంస్థలు ఘాటైన రిప్లై ఇచ్చారు. ఆకలిగా ఉన్న పక్షులు పెద్దగా చప్పుడు చేస్తాయి. అలాగే ప్రచారం కోసం తపించేవారు వాళ్ళు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తారు. మహేష్ ఫ్యాన్స్ కి నేను ప్రామిస్ చేస్తున్నా, మిమ్మల్ని మెస్మరైజ్ చేసే మూవీ రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 28 అద్భుతంగా ఉంటుంది.. అని కామెంట్ చేశారు.

సూర్యదేవర నాగవంశీ ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఆయన రాగానే నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే సూచనలు కలవు. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహేష్ మాస్ అవతార్ ఫ్యాన్స్ కి భారీ కిక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మహేష్ ఈ రేంజ్ మాస్ మూవీ చేయలేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రం. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేశారు. చాలా కాలం తర్వాత కలిసి చిత్రం చేస్తున్నారు. హీరోయిన్ పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. కాగా మహేష్ నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. సెప్టెంబర్ నుండి మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందనే ప్రచారం జరుగుతుంది.