Mahesh Babu: త్రివిక్రమ్ ను సూటిగా ప్రశ్నిస్తున్న మహేష్ ఫ్యాన్స్…

ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు గుంటూరు కారం సినిమా చేయలేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ మీద తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : April 9, 2024 2:16 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సిద్దు జొన్నలగడ్డ హీరోగా డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ అనే సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. దీనికి త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చీఫ్ గెస్ట్ లుగా రావడం విశేషం.. ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కనిపించలేదు.

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివిక్రమ్ పబ్లిక్ గా ప్రేక్షకులకు కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ మీద తీవ్రమైన కామెంట్లను చేస్తున్నారు. అవి ఏంటి అంటే గుంటూరు కారం సినిమాతో ఒక ఫ్లాప్ సినిమాని మహేష్ బాబుకి అంటగట్టారు. అదే యంగ్ జనరేషన్ అయిన సిద్దు జొన్నలగడ్డ లాంటి ఒక రైటర్ కం హీరో తీసిన డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు గుంటూరు కారం సినిమా చేయలేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ మీద తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమా యూనిట్ త్రివిక్రమ్ మీద ప్రశంశల వర్షం కురిపించడం కూడా మహేష్ బాబు అభిమానులకు నచ్చడం లేదు. ఈ జనరేషన్ తో పాటు త్రివిక్రమ్ పోటీపడి సినిమాలు చేస్తే తప్ప ఈ పోటీ ప్రపంచంలో త్రివిక్రమ్ సినిమాలకి మనుగడ ఉండదు అని చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఎందుకంటే ఈ జనరేషన్ లో డిఫరెంట్ అటెంప్ట్ లు చేస్తూ పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాని చాటుకుంటున్నారు. ఇంకా త్రివిక్రమ్ ఇప్పటికీ కూడా అవే పాత చింతకాయ పచ్చడి స్టోరీ లు, ప్రాసల మీదనే సినిమాలు నడిపించాలి అంటే కుదరని పని.. తనను తాను మార్చుకొని ముందుకు కదిలితే తప్ప త్రివిక్రమ్ సినిమాలకి మనుగడ ఉండదనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది.