spot_img
Homeబిజినెస్Maruthi Suzuki : 3 కోట్ల సేల్స్.. మారుతి సుజుకీ సంచలనం..

Maruthi Suzuki : 3 కోట్ల సేల్స్.. మారుతి సుజుకీ సంచలనం..

Maruthi Suzuki : భారతదేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తూ.. తక్కువ ధరకు అందించేందుకు మారుతి కృషి చేస్తుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ఎలాంటి కార్లనైనా ఉత్పత్తి చేసి కారు వాడే వారి మన్ననలను పొందుతుంది. ఇటీవల ఎలక్ట్రిక్ కారు లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా కొత్త మోడల్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కార్ల విక్రయాల గురించి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి సంచలన విషయాలను చెప్పారు. ఆ విషయాల్లోకి వెళితే..

1983లో మారుతి నుంచి మొదటి కారు రోడ్లపైకి వచ్చింది. ఆప్పటి నుంచి ప్రతి ఏడాది లక్షలాదిగా వెహికల్ ను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓ వైపు వినియోగదారులను ఆకర్షించేలా.. మరోవైపు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తూ కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నట్లు హిసాషి తెలిపారు. ఇప్పటి వరకు మారుతి నుంచి ఆల్టో, స్విప్ట్, వ్యాగన్ ఆర్, ఎం800, డిజైర్, ఓమిని, బాలెనో, ఈకో, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పది మోడళ్లు రికార్డులు సాధించాయి.

ఇండియా వ్యాప్తంగా 40 సంవత్సరాల నాలుగు నెలల పాటు 3 కోట్ల యూనిట్లను ఉత్పతి చేశామని హిసాషి పేర్కొన్నారు. వీటిలో హర్యానా ప్లాంటులో 2.68 కోట్లకు పైగా వాహనాలు తయారు చేయగా.. MSIL అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటార్స్ గుజరాత్ లో 32 లక్షలకు పైగా వాహనాలను తయారు చేశారు. ప్రస్తుతం మారుతి కి చెందిన 18 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.  వీటిలో 9 కార్లు అరేనా డీలర్ షిప్ ద్వారా, 8 కార్లు నెక్సా డీలర్ షిప్ ద్వారా సేల్స్ ను జరుపుకుంటున్నాయి.

ఈ సందర్భంగా హిసాషి టేకుచి మాట్లాడుతూ మారుతి కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వినియోగదారులు మాపై నమ్మకం ఉంచారు. వారందరికీ ధన్యవాదాలు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇండియా నుంచి వాహనాల ఎగుమతుల్లో మారుతికి 40 శాతం వాటా ఉన్నట్లు ఆయన తెలిపారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version