Telugu Heroines: సినిమా అంటేనే లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చూపించడం. ఇక నటీనటుల పాత్రల విషయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన నటీమణులు ఉన్నారు. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి నటీమణులు కొందరు తమ నటనతో ఆకట్టుకున్నారు.
మరి ఆ హీరోలు ఎవరో తెలుసా ? నాటి ఎన్టీఆర్, క్రిష్ణ నుంచి చిరంజీవి తో పాటు ప్రభాస్ వరకు ఇలాంటి పాత్రలలో నటించారు. ఒకప్పటి తమ హీరోయిన్నే అమ్మ అని పిలిచారు. ఇంతకీ అలా నటించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.
భానుమతి

అలనాటి అద్భుత నటి భానుమతి. ఆమె ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాంటి తను 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించి మెప్పించింది.
Also Read: పవన్ కళ్యాణ్ పక్కన అలా కూర్చుని షాక్ ఇచ్చిన ‘హైపర్ ఆది’
అంజలి దేవి

నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అంజలి దేవి. అనంతరం పలు సినిమాల్లో ఏఎన్ఆర్ కి తల్లిగా కూడా నటించి మెప్పించింది.
సుజాత

దివంగత నటీమణి సుజాత కూడా చిరంజీవితో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా చేసింది.
భానుప్రియ

జయం మనదేరా సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించింది ఆమె. అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగానూ నటించింది. ఇక అంతకు ముందు శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం వంటి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
అనుష్క శెట్టి

బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కు భార్యగా.. జూనియర్ ప్రభాస్ కు తల్లిగా నటించి మెప్పించింది అనుష్క శెట్టి.
Also Read: ప్రేమలో పడిన శ్రీముఖి.. మాట్లాడదాం అంటుంది
[…] […]
[…] srireddy and sriram: సినీ నటి శ్రీరెడ్డి గురించి తెలియని ఆడియన్స్ ఉండరు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా క్యాస్టింగ్ కౌచ్ పేరిట చేసిన రచ్చ మాములుగా లేదు. సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లను రకరకాల వేధిస్తున్నారని, కొందరికి అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ అప్పట్లో ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన హల్ చల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అప్పటి నుంచి శ్రీరెడ్డి తెలుగు సినిమా నటులే కాకుండా తమిళ సినీ రంగానికి చెందిన కొందరి వ్యవహారాలను బయటపెడుతూ వస్తోంది. అయితే ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అన్నారు. కానీ శ్రీరెడ్డి మాత్రం సోషల్ మీడియాలో పరుష వ్యాఖ్యలతో కొందరిపై విరుచుకుపడుతూ వస్తోంది. […]
[…] KCR Mamatha: దేశంలో అనుకున్నట్లే మూడో కూటమి ఏర్పడబోతుందా..? బీజేపీ, కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయా..? జాతీయ పార్టీలతో దేశం సర్వ నాశనమైందని.. ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చని ప్రాంతీయ పార్టీ నేతలు భావిస్తున్నారా..? తాజా పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఆజ్యం ఆగ్గి రాజేసింది. కమలంపై కత్తులు నూరేందుకు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంతో సఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలతో కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. ఇక ఆదివారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహిరంగ ప్రకటన చేయడం ద్వారా మూడో కూటమికి బీజం పడే అవకాశాలున్నాయని అంటున్నారు. […]
[…] China India: భారతదేశం, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ఇప్పటికే దేశంలో చైనాపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని ఆదేశించింది. అంతేకాకుండా చైనాకు చెందిన యాప్ లను నిషేధించింది. చైనాతో మనకు ఎప్పటికీ శత్రుత్వమేనని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఇటీవల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీ వచ్చారు. అంతేకాకుండా సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభినందించారు. అయితే ఈ విగ్రహం చైనాకు చెందిన కంపెనీతో తయారు చేయించారు. దేశంలో కంపెనీలు లేనట్లు చైనాకే ఎందుకు అప్పగించారు..? అనే విమర్శలు వస్తున్నారు. […]
[…] Love Mouli: ‘లవ్ మౌళి’ అనే విభిన్న తరహా చిత్రంలో నవదీప్ 2.0గా పరిచయం అవుతున్నాడు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లవ్ మౌళి’ మూవీ నుంచి నవదీప్కి జోడీగా నటిస్తున్న హీరోయిన్ ఫంకూరి అద్వాని ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. […]