Homeఎంటర్టైన్మెంట్Renu Desai : ఇన్ స్టా లో రేణు దేశాయ్ కి షాక్ ఇచ్చిన ఫాలోవర్స్......

Renu Desai : ఇన్ స్టా లో రేణు దేశాయ్ కి షాక్ ఇచ్చిన ఫాలోవర్స్… మ్యాటరేంటంటే..?

Renu Desai : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు చాలా సినిమాలను చేస్తు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమంది నటీమణులు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకుంటారు. ఇక ఆ విషయానికి వస్తే ‘బద్రి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ‘రేణు దేశాయ్’ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నటిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రేమించడం కొద్దిరోజులు ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ‘జానీ ‘ సినిమాలో మరొకసారి కనిపించి మెప్పించింది. ఇక ఇదిలా ఉంటే ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన నుంచి విడిపోయి ప్రస్తుతం పూణేలో పిల్లలతో కలిసి ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుసగా సినిమాలు చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాల్లో సెలెక్టెడ్ పాత్రలను మాత్రమే చేస్తాను అని చెప్పి అందరికీ ఒక షాక్ ఇచ్చింది. ఇక మొత్తానికైతే ఆమె సినిమా నుంచి దూరంగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు.

ఆమె లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తమ అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ప్రతి వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆమె సమాజంలో జరుగుతున్న చాలా విషయాల మీద కూడా స్పందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఆమె అభిమానులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.

అది ఏంటి అంటే ఒక పెట్ కి సర్జరీ చేయించాలని దానికోసం తల కొంత విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఆమె ఊహించినదానికి భిన్నంగా తన ఫాలోవర్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె తీవ్రంగా బాధపడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పోస్ట్ మీద తను స్పందిస్తూ నాకు ఇన్ స్టా లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటిది అందులో కేవలం పది మంది మాత్రమే నేను పెట్టిన పోస్ట్ కి స్పందించి విరాళాలు చేయడానికి ముందుకొచ్చారు…
అందరిలో సహాయం చేయాలనే గుణం తగ్గిపోయిందా ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆమె ఈ విషయం మీద స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది…

ఇక మొత్తానికైతే రేణు దేశాయ్ ఊహించిన దాని కంటే భిన్నంగా తన ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె ఈ పరిణామాన్ని చూసి తట్టుకోలేకపోతుంది… అలాగే ఆమెకి ఇన్ స్టా లో తన ఫాలోవర్స్ ఒక పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కొంతమంది ఆమె పెట్టిన పోస్ట్ పక్కన పెట్టి ‘అకిరా నందన్’ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version