Ranveer Singh: ‘ధురంధర్’ సిరీస్ తో హీరో రణవీర్ సింగ్ ఓవర్ నైట్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. డిసెంబర్ నెల నుండి జూన్ వరకు ఆయన మేనియా నే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నడిచింది. ‘ధురంధర్ 2’ చిత్రం ఓటీటీ లో విడుదలై చాలా రోజులైంది , కానీ ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది అంటే , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చినప్పటికీ, కచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అనిపించే విధంగా ఉంటాయి, అలాంటి సినిమాల్లో ‘ధురంధర్’ సిరీస్ కూడా ఒకటి. అందుకే ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇంత పెద్ద హిట్ తర్వాత రణవీర్ సింగ్ కి తన తదుపరి చిత్రాన్ని హ్యాండిల్ చేయడం కత్తి మీద సాము లాంటిది.
అందుకే చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన తన ఫోకస్ ని పూర్తి స్థాయిలో ‘ప్రళయ్’ అనే చిత్రం పై పెట్టారు. ఈ చిత్రాన్ని హాసన్ మెహతా కుమారుడు , జై మెహతా తెరకెక్కిస్తున్నారు. గతం లో హాసన్ మెహతా రణ్వీర్ సింగ్ తో ‘స్కాం 1992’ అనే చిత్రాన్ని తీసి భారీ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు రణ్వీర్ తో పని చేస్తుండడం తో ఈ సినిమాపై అంచనాలు మొదటి నుండే భారీగా ఉండేవి ఇప్పుడు ‘ధురంధర్ 2’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా తారా స్థాయికి చేరుకున్నాయి. భారీ బడ్జెట్ తో జాంబీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాని రణవీర్ సింగ్ స్వయంగా తన సొంత బ్యానర్ అయినటువంటి ‘మా కోసం ఫిలిమ్స్’ పై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టనున్నారు. సుమారుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో , హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ ని చేయించే ప్లాన్ లో ఉన్నారు రణవీర్ సింగ్. మరో పక్క ‘డాన్ 3’ వివాదం సాగుతూనే ఉంది. రణవీర్ సింగ్ పై బ్యాన్ కూడా విధించారు. ఇలాంటి అంశాలు సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారమై తన దృష్టిని మరలించే అవకాశం ఉన్నందున , ఆయన ఒక 18 నెలల పాటు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగానే రణవీర్ సింగ్ సోషల్ మీడియా లో పెద్దగా యాక్టీవ్ గా ఉండరు, అప్పుడప్పుడు మాత్రమే ఆయన పోస్టులు వేస్తుంటారు , ఇప్పుడు అది కూడా ఉండబోవడం లేదు.
