spot_img
Homeఎంటర్టైన్మెంట్మరో కాంట్రవర్సీకి తెరలేపిన ఆర్జీవీ

మరో కాంట్రవర్సీకి తెరలేపిన ఆర్జీవీ


సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరింత వేగం పెంచాడు. ఒకే సారి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడూ డిఫరెండ్ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి ‘నగ్నం’. ఇటీవలే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’ అనే మూవీతో ముందుకొచ్చాడు. ఆర్జీవీ వరల్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆ వెంటనే నగ్నం చిత్రం ట్రైలర్ను విడుదల చేశాడు. చీర కట్టుకున్న ఓ మహిళ శరీరభాగాలపై ఫోకస్ పెట్టి ఒకటిన్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ను కట్ చేశాడు. నాక్‌డ్, నంగా, నగ్నం అన్న పేర్లు ఉండడంతో దీన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్‌ చేస్తారని అర్థమవుతోంది. దీన్ని చూడాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని ఆర్జీవీ ప్రకటించాడు.

‘నగ్నం’ ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లోనే రాము మరో రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే మీద ఓ సినిమా తీస్తున్నట్టు తెలిపాడు. దీనికి ‘ది మ్యాన్ హూ కిల్డ్‌ గాంధీ’ అని టైటిల్ ఖరారు చేశాడు. గాంధీని చంపిన గాడ్సే తనను తానే చంపుకున్నాడని పేర్కొంటూ ఈ మూవీ విశేషాలను ట్విట్టర్లో చెబుతున్నాడు ఆర్జీవీ. అలాగే, ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ అనే మరో మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఓ ఇంట్లో మందుకొడుతున్న నలుగురు కుర్రాళ్లు గోడపై కత్రినా కైఫ్ ఫొటోను చూస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కరోనా నేపథ్యంలో థియేటర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఫూచర్ సినిమా.. థియేటర్, ఓటీటీలో కాదు కేవలం పర్సన్ యాప్స్‌లో చూడాల్సి ఉంటుందని వర్మ ట్వీట్ చేశాడు.

గాంధీ ముఖంలో గాడ్సే
‘ది మ్యాన్ హూ కిల్డ్‌ గాంధీ’ చిత్రం వివాదాస్పదమయ్యేలా ఉంది. ఈ మూవీ ప్రకటనతోనే సంచలనానికి తెరలేపిన ఆర్జీవీ తాజాగా ఓ పోస్టర్రిలీజ్ చేశాడు. అందులో గాంధీ, గాడ్సే ఇద్దరి ముఖాలను కలిపివేశాడు. కళ్లజోడు పెట్టుకున్న జాతిపిత ఫొటోను మార్పింగ్ చేసి గాడ్సే ఫొటోను అతికించిన పోస్టర్ పై ఇప్పటికే సామాజిక కార్యకర్త బాబు గోగినేని అసహనం వ్యక్తం చేశారు. హత్యచేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తుల ఫొటోలను మార్పింగ్ చేస్తూ ఇలా పోస్టర్‌ విడుదల చేయడం సరికాదన్నారు. ఏమిటి, ఈ అకతాయితనం అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కానీ, తనది భావ ప్రకటనా స్వేచ్ఛ అని, డైరెక్టర్ గా క్రియేటివిటీ చూపించడం నా హక్కు అని ఆర్జీవీ తనదైన స్టయిల్లో జవాబిచ్చాడు. ‘మార్ఫింగ్ చేసిన ఈ పోస్టర్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సినిమా పూర్తిగా చుసిన తర్వాత తెలుస్తుంది. సినిమాను చూడకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు మీకు లేదు. పోయి బీరు తాగి ప్రశాంతంగా ఉండండి’ అని సలహా ఇచ్చాడు.

https://twitter.com/RGVzoomin/status/1270566259843756034

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper
Exit mobile version