అజ్ఞాతవాసి అనంతరం ఇండస్ట్రీకి దూరమైన పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ ‘పింక్’ మూవీ రీమేక్ ‘వకీల్ సాబ్’తో పవన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకురానున్నారు. రాజకీయాల్లో కొన్నేళ్ల పాటు బిజీగా ఉన్న పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. లాక్డౌన్కు ముందు కొన్ని షెడ్యూల్స్లో షూటింగ్ కూడా చేశారు. ఇప్పటికే పవన్ ఫస్ట్ లుక్తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. దిల్రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ మూవీలో శ్రుతి హాసన్ నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై శ్రుతీనే హింట్ ఇచ్చింది. శ్రుతి రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయింది. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ‘వకీల్ సాబ్’లో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా జవాబివ్వలేదు. ‘ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పను’ అని బదులిచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో భాగం కాకపోయి ఉంటే ఆమె నేరుగా లేదు అని చెప్పేది. నటిస్తుంది కాబట్టే ఇప్పుడు చెప్పను అన్నదని అభిమానులు భావిస్తున్నారు. బహుశా వకీల్ సాబ్లో శ్రుతి గెస్ట్ అపియరెన్స్ లేదంటే సర్ప్రైజ్ రోల్ పోషిస్తుందేమో అని అనుకుంటుకున్నారు. పవర్ స్టార్ సూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్’లో హీరోయిన్గా మెప్పించిన శ్రుతి పవన్తో మరోసారి యాక్ట్ చేస్తుందో లేదో చూడాలి. పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్న వకీల్ సాబ్లో అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాశ్ రాజ్, నరేశ్, అనసూయ కూడా నటిస్తున్నారు.