SS Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. కెరియర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటివరకు ఎప్పుడు నిరాశపరచలేదు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇక రాజమౌళి ఒక ప్రొడ్యూసర్ విషయంలో కొంతవరకు అసంతృప్తి గా ఉన్నానని గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకి ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంటే అల్లు అరవింద్ గా తెలుస్తుంది. మగధీర సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని అప్పుడే రాజమౌళి చెప్పారట.
Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?
కానీ అల్లు అరవింద్ మాత్రం అవసరం లేదని కేవలం తెలుగులో రిలీజ్ చేస్తే చాలని చెప్పారట. దాంతో రాజమౌళి తీవ్రంగా అప్సెట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక అప్పటినుంచి కొద్ది రోజులపాటు అల్లు అరవింద్ తో ఆయన మాట్లాడలేదు. ఆయన బ్యానర్ లో మరో సినిమా చేయమని చెప్పిన కూడా రాజమౌళి చేయడానికి ఇష్టపడడం లేదు.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చెప్పినట్టుగా అల్లు అరవింద్ మగధీర సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే ముందే మగధీరతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయేది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఒక రకంగా రాజమౌళి అల్లు అరవింద్ చేసిన దానికి తను నమ్మించి మోసం చేశాడనే ఒక భావన అయితే రాజమౌళి లో ఉండిపోయిందట. అందుకే చాలా రోజులు పాటు ఆయనతో మాట్లాడలేదు.
ఇక ఇప్పుడు అంత సెట్ అయిపోయింది ప్రస్తుతం రాజమౌళి ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా పాన్ వరల్డ్ లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…