Mohan Babu Brahmanandam: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి రాబోయే కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ రోజు, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్ గా కూడా వర్క్ చేశారు.
Mohan Babu Son of India Movie
కాగా ఈ సినిమాలో శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. పైగా ఈ సినిమాలో మోహన్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Mohan Babu Brahmanandam
Also Read: రాధేశ్యామ్’, ‘రామారావు’, ‘కేజీఎఫ్ -2’ రిలీజ్ డేట్స్ ఫిక్స్ !
ఇక మరో సినిమా విషయానికి బ్రహ్మానందం మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘పంచతంత్రం’. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ను జర్నీ ఆఫ్ వ్యాస్ పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైరయి 60 ఏళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనే వ్యక్తిగా వేద వ్యాస్ పాత్రలో బ్రహ్మి నటిస్తున్నారు.
Mohan Babu Brahmanandam
Also Read: ఆ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి.. రష్మీలో విప్లవం !
‘ఏమ్మా.. కెరీర్ ఇరవైల్లోనే మొదలుపెట్టాలా? అరవైల్లో మొదలుపెట్టకూడదా?’ అని ఆయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. బ్రహ్మానందం కూతురుగా స్వాతి నటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ నటులు మెయిల్ లీడ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి.