‘మనోజ్ – బన్నీ’ కలయికలో ‘పుష్ప’ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మంచు మనోజ్ గతంలో వేదం సినిమాలో కలిసి నటించారు. అయితే, తాజాగా ఈ కాంబినేషన్ మళ్ళీ తెర పైకి వచ్చేలా కనిపిస్తోంది. బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మంచు మనోజ్ నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే సుకుమార్, మనోజ్ కి కథ చెప్పాడని, మనోజ్ కూడా నటించడానికి అంగీకరించాడని సమాచారం. నిజానికి ఈ సినిమాలో తమిళ హీరో […]

Written By: admin, Updated On : February 13, 2021 7:02 pm
Follow us on


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మంచు మనోజ్ గతంలో వేదం సినిమాలో కలిసి నటించారు. అయితే, తాజాగా ఈ కాంబినేషన్ మళ్ళీ తెర పైకి వచ్చేలా కనిపిస్తోంది. బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మంచు మనోజ్ నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే సుకుమార్, మనోజ్ కి కథ చెప్పాడని, మనోజ్ కూడా నటించడానికి అంగీకరించాడని సమాచారం. నిజానికి ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి మనోజ్ చేస్తోన్న పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి.

Also Read: శంకర్-రాంచరణ్ సినిమా అనౌన్స్.. దిల్ రాజ్ నిర్మాత.. కథ వింటే గూస్ బాంబ్స్ ఖాయం

విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని మొదట కమిట్ అయ్యాడు. కాకపోతే కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అవ్వడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ పాత్రలో మంచు మనోజ్ అయితే బాగుంటాడని, అతన్నే తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. పైగా మనోజ్ – బన్నీలది హిట్ కాంబినేషన్. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ లోపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: ప్రేమ‌పెళ్లి చేసుకున్న సినీతార‌లు.. మీ స్టార్లు ఉన్నారేమో చూడండి!

అన్నట్లు వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో బన్నీ పై షూట్ స్టార్ట్ చేస్తారట. ఆ తరువాత ఇక్కడే బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని.. ఈ సాంగ్ తరువాత సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ షూట్ ను కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్