ఏపీలో దారుణం.. మిస్డ్ కాల్ కు వివాహిత బలి

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. సాఫీగా సాగుతున్న కాపురంలో భార్య ఫోన్ కు వచ్చిన మిస్డ్ కాల్ చిచ్చురేపింది. చివరికీ భార్య హత్యకు దారితీయడం శోచనీయంగా మారింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని కొస్రూరు మండలం దొడ్లేరు గ్రామంలో చోటుచేసుకుంది. బోడా సుబ్బారావు, బోడా కోటేశ్వరమ్మ(28) ఇద్దరు భార్యభర్తలు. కొద్దికాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే గతకొంకాలంగా సుబ్బారావు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 2:37 pm
Follow us on


ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. సాఫీగా సాగుతున్న కాపురంలో భార్య ఫోన్ కు వచ్చిన మిస్డ్ కాల్ చిచ్చురేపింది. చివరికీ భార్య హత్యకు దారితీయడం శోచనీయంగా మారింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని కొస్రూరు మండలం దొడ్లేరు గ్రామంలో చోటుచేసుకుంది.

బోడా సుబ్బారావు, బోడా కోటేశ్వరమ్మ(28) ఇద్దరు భార్యభర్తలు. కొద్దికాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే గతకొంకాలంగా సుబ్బారావు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో కోటేశ్వరమ్య ఫోన్ కు మిస్డ్ కాల్ వచ్చింది. భార్య ప్రియుడే ఫోన్ చేసి ఉంటాడని ఆమెతో సుబ్బారావు గొడవకు దిగాడు.

ఈక్రమంలోనే ఆవేశానికి గురైన సుబ్బారావు తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ప్రస్తుతం గుంటూరులో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.