శ్రీయ శరన్ భర్తకి కరోనా..!

నువ్వే నువ్వే ఛత్రపతి , శివాజీ , ఠాగూర్ వంటి చిత్రాల్ నాయిక గా నటించిన స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ కొన్నేళ్ల కిందటే రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొషీవ్ ని పెళ్లాడటం జరిగింది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ కొంత కాలం ఇండియాలోనే ఉన్న శ్రియ.. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో భర్త తో కలిసి ఫారెన్ లో ఉంటోంది. వీళ్లిద్దరూ కొన్ని నెలలుగా స్పెయిన్లో గడుపుతున్నారు. […]

Written By: admin, Updated On : April 15, 2020 2:51 pm
Follow us on


నువ్వే నువ్వే ఛత్రపతి , శివాజీ , ఠాగూర్ వంటి చిత్రాల్ నాయిక గా నటించిన స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ కొన్నేళ్ల కిందటే రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొషీవ్ ని పెళ్లాడటం జరిగింది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ కొంత కాలం ఇండియాలోనే ఉన్న శ్రియ.. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో భర్త తో కలిసి ఫారెన్ లో ఉంటోంది. వీళ్లిద్దరూ కొన్ని నెలలుగా స్పెయిన్లో గడుపుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కరోనా వైరస్ స్పెయిన్ దేశప్రజల్ని వణికించడం స్టార్ట్ అయ్యింది.

ప్రపంచంలో కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్ ఒకటి అని రోజూ టివి ల్లో మనం కూడా చూస్తూనే వున్నాం అలా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న సమయంలోనే శ్రియ, ఆండ్రీ కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి .

సడన్ గా ఆండ్రీ కొషీవ్ లో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడం తో శ్రీయ అనుమానంగా డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తే కరోనా బారిన పడినట్లు తేలింది. కానీ వైద్యులు అక్కడ చేర్చుకోవడానికి అంగీకరించలేదని.. వెంటనే ఇంటికి వెళ్లిపోమన్నారని శ్రియ వెల్లడించింది. ఆండ్రీ కొషీవ్ కి కరోనా ఎక్కువ ఉన్నా, లేకున్నా అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రుల్లో ఉంటే కచ్చితంగా ఈ వైరస్ ఇంకా ఎక్కువ ఆవుతుందని..ఇంటిదగ్గరే క్వారంటైన్లో ఉండి మందులు వేసుకొంటున్నాడని శ్రియ తెలిపింది. ఇంటికి తిరిగొచ్చేశాక .ఆండ్రీ కొషీవ్. ఒక గదికి పరిమితమై మందులు వాడుతున్నాడని., ఇప్పుడు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని శ్రియ వెల్లడించింది ..అని తెలుస్తోంది .