చై-సామ్ మరోసారి మాయ చేస్తారా?

అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘ఏ మాయ చేశావే’. నాగచైతన్యకు ఇది రెండో సినిమా కాగా. సమంతకు తొలి సినిమా. పదేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంతో ‘ఏ మాయ చేశావే’ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కింది. తెలుగులో నాగచైతన్య-సమంత జోడీ నటించగా తమిళంలో శింబు-త్రిష జోడీ నటించారు . ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ విజయం సాధించింది. సమంత-చైతూ జోడీ ప్రేక్షకులను నిజంగా మాయ చేయడంతో ఈ మూవీ […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 4:22 pm
Follow us on


అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘ఏ మాయ చేశావే’. నాగచైతన్యకు ఇది రెండో సినిమా కాగా. సమంతకు తొలి సినిమా. పదేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంతో ‘ఏ మాయ చేశావే’ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కింది. తెలుగులో నాగచైతన్య-సమంత జోడీ నటించగా తమిళంలో శింబు-త్రిష జోడీ నటించారు . ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ విజయం సాధించింది. సమంత-చైతూ జోడీ ప్రేక్షకులను నిజంగా మాయ చేయడంతో ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తొలి సినిమాతోనే సమంత భారీ విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అగ్రహీరోలకు జోడీగా నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

‘ఏం మాయ చేశావే’ మూవీ సమయంలో నాగచైతన్య-సమంత స్నేహితులుగా మారిపోయారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో సమంత అక్కినేని కోడలుగా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూ బీజీగా మారిపోయింది. సమంత పెళ్లి తర్వాత చైతూతో కలిసి ‘మజిలీ’ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా భారీ విజయం సాధించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీలు తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే లేడి ఓరియేంటెడ్ మూవీల్లో సమంత నటిస్తూ తోటి హీరోయిన్లకు ఛాలెంజ్ విసురుతోంది. సమంత నటించిన ‘ఓ బేబీ’ మూవీ మంచి విజయం సాధించింది. అయితే ఇటీవల శర్వానంద్-సమంత నటించిన తమిళ రీమేక్ మూవీ 96 తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు.

ఇదిలా ఉంటే దర్శకుడు గౌతమ్ మీనన్ ‘ఏం మాయ చేశావే’ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఈమేరకు త్వరలోనే మూవీని ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. తమిళంలో గతంలో ఈ మూవీలో నటించిన శింబు, త్రిషలు నటించనున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ సీక్వెల్ పై దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తెలుగులోనూ ఈ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగులో నాగచైతన్య-సమంతలే నటిస్తారా? లేదా కొత్త జోడీ నటిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే చై-సామ్ జోడీనే ఈ మూవీలో నటిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.