Nara Lokesh : గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల భద్రత, రాజకీయ నాయకుల బాధ్యత, అధికార పార్టీ వైఖరి వంటి అంశాలపై ఈ ఘటన మరోసారి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడేనని సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిందితుడిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదే సమయంలో నారాలోకేష్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కూడా ఆలస్యం చేయకుండా అతడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. రాజకీయ అనుబంధం ఉన్నందున ఎలాంటి వెసులుబాటు ఇవ్వబోమనే సంకేతాన్ని పార్టీ ఈ చర్యతో ఇచ్చింది.
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ సొంత పార్టీకి చెందిన నాయకుడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవడం మాత్రం అరుదుగా కనిపించే పరిణామం. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనలో మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అదే చర్చకు కేంద్రబిందువైంది.
ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిందితుడిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా అతడు అధికార పార్టీకి చెందిన నాయకుడని తేలిన వెంటనే పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయించడం ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
“రాజకీయ అండ కానీ, పార్టీ అనుబంధం కానీ చట్టం నుంచి ఎవరినీ కాపాడదు” అని లోకేష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. మహిళలపై దాడులకు ఎలాంటి రాజకీయ రంగు ఉండదని, నిందితుడు ఎవరివాడైనా చట్టం ముందు సమానమేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో నారా లోకేష్ ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ, సోషల్ మీడియా నుంచి పరిపాలనా వ్యవస్థ వరకు వేగంగా స్పందించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే తరహాలో గుంటూరు ఘటనలో కూడా ఆలస్యం చేయకుండా పార్టీపరంగా, ప్రభుత్వపరంగా చర్యలు ప్రారంభించడం ఆయన వ్యవహార శైలిని ప్రతిబింబించింది.
రాజకీయాల్లో తరచూ వినిపించే విమర్శ ఏమిటంటే… అధికార పార్టీలకు చెందిన నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు ఆలస్యమవుతాయనేది. కానీ ఈ ఘటనలో అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకుండా లోకేష్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ప్రతిష్ఠ కంటే చట్టానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా “తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే” అని ప్రకటించగా, ఆ మాటలను అమలు చేసే దిశగా లోకేష్ వేగంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ వైఖరిని మరింత స్పష్టం చేసింది. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం ఈ వ్యవహారంలో ప్రభుత్వ సీరియస్నెస్ను వెల్లడించింది.
ఈ ఘటనతో నారా లోకేష్ మరోసారి ఒక రాజకీయ సందేశాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నా, సొంత పార్టీకి చెందిన వారే అయినా తప్పు చేస్తే ఉపేక్ష ఉండదని, మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. రాజకీయ అనుబంధాల కంటే చట్టానికే ప్రాధాన్యం ఇవ్వాలనే వైఖరిని ఆయన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గుంటూరు ఘటనలో చివరికి న్యాయం ఎంత వేగంగా జరుగుతుందనేది ఒక అంశం అయితే, తొలి స్పందనలోనే “మనవాళ్లే అయినా చట్టం ముందు సమానమే” అనే సందేశాన్ని నారా లోకేష్ బలంగా వినిపించడం మాత్రం ఈ ఘటనలో ప్రత్యేకంగా నిలిచే అంశంగా మారింది.
