గూస్ బాంబ్: పట్టాలెక్కిన మహేష్-రాజమౌళి మూవీ

ఒకరేమో దర్శక ధీరుడు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తీసి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన జక్కన్న రాజమౌళి.. మరోవైపు అమ్మాయిల అందగాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్న సుందరాంగుడు. ఈ ఇద్దరూ కలిస్తే గూస్ బాంబ్ యే. ఇద్దరి నెక్ట్స్ సినిమా ఖాయమైంది. రాజమౌళి-మహేష్ సినిమాపై ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలున్నాయి. మహేష్ కోసం ఇప్పటికే లాక్ డౌన్ కరోనా వేళ స్టోరీ కోసం కసరత్తు చేశారని.. రాజమౌళి […]

Written By: NARESH, Updated On : June 29, 2021 10:48 pm
Follow us on

ఒకరేమో దర్శక ధీరుడు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తీసి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన జక్కన్న రాజమౌళి.. మరోవైపు అమ్మాయిల అందగాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్న సుందరాంగుడు. ఈ ఇద్దరూ కలిస్తే గూస్ బాంబ్ యే.

ఇద్దరి నెక్ట్స్ సినిమా ఖాయమైంది. రాజమౌళి-మహేష్ సినిమాపై ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలున్నాయి. మహేష్ కోసం ఇప్పటికే లాక్ డౌన్ కరోనా వేళ స్టోరీ కోసం కసరత్తు చేశారని.. రాజమౌళి తండ్రి కథ రెడీ చేశారని సమాచారం.

ప్రస్తుతానికి ‘జేమ్స్ బాండ్’ కథను మహేష్ కోసం రాజమౌళి తయారు చేసినట్టు భోగట్టా. అందులో కౌబాయ్ సెటప్ కూడా ఉందని తెలుస్తోంది. మొత్తం ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లాంటి కథను మహేష్ కోసం రాజమౌళి తయారు చేశాడని.. ఇటీవలే రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ లు కలిసి మహేష్ ఇంటికెళ్లి మరీ వినిపించారని టాక్. ఈ క్రమంలోనే తన రెండు సినిమాలు ‘సర్కారివారి పాట’, త్రివిక్రమ్ మూవీలు వేగంగా కంప్లీట్ చేయాలని మహేష్ డిసైడ్ అయ్యాడట.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యాక వెంటనే రాజమౌళి సినిమాను పట్టాలెక్కించాలని ఇద్దరూ డిసైడ్ అయినట్టు సమాచారం.