Dil Raju Vs Mythri Ravi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంటే ఎగ్జిబ్యూటర్లు మాత్రం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బావుంటున్నారు ఒక్క మేము తప్ప అంటూ వాళ్లు వాళ్ళ ఇబ్బందులను తెలియజేస్తున్నారు…సింగిల్ స్క్రీన్ థియేటర్లకి రెంటెండ్ పర్పస్ లో కాకుండా పర్సంటేజ్ లో రూపంలో డబ్బులు చెల్లిస్తేనే థియేటర్లు నడుపుతామని లేకపోతే వాటన్నింటిని మూతపడేస్తాం అంటూ హైదరాబాదులో ఉన్న 23 థియేటర్ల ఎగ్జిబ్యూటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు తమ్ముడు అయిన శిరీష్ పెట్టారు. అందులో తను సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్ల యొక్క బాధలను వివరించారు. రెంటల్ పర్పస్ లో డబ్బులు చెల్లించడం వల్ల అవి థియేటర్ రెంట్లు కట్టుకోవడానికి సరిపోవడం లేదంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుంది అంటూ ఆయన మాట్లాడారు. హీరోలకు వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయవచ్చు. అలాగే ప్రొడ్యూసర్స్ సైతం వాళ్ల సినిమాని ఏ రేట్ కి అమ్ముకోవాలి అనేది వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. కానీ థియేటర్లను నడిపించే ఎగ్జిబ్యూటర్లు మాత్రం ఏం మాట్లాడకూడదు అంటే వాళ్లకు మాట్లాడే స్వాతంత్ర్యం లేదా వాళ్ళ బాధలను వాళ్ళు చెప్పుకోకూడదా అంటూ కొన్ని ఘాటు కామెంట్లు చేశారు. ఇక దీనికి కౌంటర్ వేస్తూ మైత్రి రవి, నాగ వంశీ ఇలాంటి ప్రొడ్యూసర్లు మరొక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు… మైత్రి రవి మాట్లాడుతూ మేము విమల్ థియేటర్ ని లీజు కి తీసుకుని దానిని చాలా బాగా డెవలప్ చేశాం. అందులో ఏసీ ని, కూర్చునే సీట్లను కూడా రెన్నోవేషన్ చేశాం. దానివల్ల ప్రేక్షకుడు థియేటర్ కి వస్తున్నాడు. మా థియేటర్లోనే ఎక్కువ సినిమాలను చూస్తున్నారు.
తద్వారా మాకు ప్రాఫిట్ కూడా వస్తుంది అంటూ ఆయన చెప్పాడు. ప్రేక్షకులు థియేటర్ కి రాకుండా ఉండడానికి మెయిన్ కారణం ఆ థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. అవి ఒకవేళ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని సింగిల్ స్క్రీన్స్ లోనే సినిమాలు చూస్తారని ఆయన మాట్లాడుతున్నాడు.
ఇక నాగ వంశీ సైతం మైత్రి రవిని సపోర్ట్ చేస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడిపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ముడివేయండి అంతే తప్ప ఇలాంటి కండిషన్లు పెట్టడం సరైనది కాదు అంటూ తను ఎగ్జిబ్యూటర్లను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు.
అయితే వీళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత అటు శిరీష్ ఇటు రవి, నాగ వంశీలలో తప్పు ఎవరిది ఎందుకని ఇలా చేస్తున్నారు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి… ఇక శిరీష్ ఎగ్జిబ్యూటర్ల సైడ్ నుంచి ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం ప్రేక్షకులను థియేటర్ కి రప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు…ఇక వీళ్లలో తప్పు ఎవరిది అని చెప్పడం కష్టమే ఎందుకంటే వీళ్ళిద్దరూ సినిమా గురించే ఆలోచిస్తున్నారు…
