spot_img
Homeఎంటర్టైన్మెంట్Rushikonda Palace: రుషికొండ భవనాలు అలా.. ప్రజాభిప్రాయమే ఫైనల్!

Rushikonda Palace: రుషికొండ భవనాలు అలా.. ప్రజాభిప్రాయమే ఫైనల్!

Rushikonda Palace: విశాఖ( Visakhapatnam) రుషికొండ నిర్మాణాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీ నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి ఎందుకు నిర్మించారో చెప్పే పరిస్థితి లేదు. అయితే ఈ నిర్మాణాలపై అడ్డగోలుగా మాట్లాడేవారు వైసిపి నేతలు. కానీ ఎక్కడ అధికారిక ప్రకటన ఉండేది కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం అయితే తప్పేంటి? క్యాంప్ ఆఫీస్ అయితే వచ్చే నష్టం ఏంటి? అని అడ్డగోలుగా మాట్లాడేవారు. అయితే విశాఖకే ల్యాండ్ మార్క్ గా నిలిచే రిషికొండను బోడి గుండు చేయడం ఎవరికీ నచ్చలే. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాత పెట్టారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాణాలను ఎలా వాడుకోవాలో కూడా కూటమి ప్రభుత్వానికి తెలియడం లేదు. ఆ నిర్మాణాలకు చేసిన ఖర్చు.. ఆ భవనాల నిర్వహణ అనేది ఇబ్బందికరమే. అందుకే ఎలా వాడుకోవాలో తెలియక ప్రజాభిప్రాయాన్ని కోరింది ప్రభుత్వం.

* రిసార్టులు తొలగించి..
విశాఖ రుషికొండ ( rushikonda )అంటే ప్రముఖ పర్యాటక కేంద్రం. దానిపై పెద్ద పెద్ద రిసార్ట్లు ఉండేవి. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అయితే ఆ నిర్మాణాలన్నింటినీ తొలగించారు జగన్మోహన్ రెడ్డి. రిసార్టులను తొలగించి ఆదాయాన్ని పడేశారు. పైగా వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేశారు. భారీ భవంతులను నిర్మించారు. 2024లో మరోసారి అధికారంలోకి వస్తామని.. ఈ భవంతులనుంచే పాలన సాగిస్తామని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఒకటి తలిస్తే.. జనాలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణంగా ఓడించడంతో రుషికొండ నిర్మాణాలు బేల చూపులు చూడడం ప్రారంభించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రూపాల్లో వాటిని వినియోగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే వైసిపి పాపం కూటమికి శాపం కాకూడదని భావించిన చంద్రబాబు సర్కార్ వాటి వినియోగానికి అనేక రకాల ఆలోచనలు చేసింది. ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం పర్యాటక శాఖా పరంగా వినియోగించాలని సూచించారు.

* పర్యాటకానికి ఊతం..
విశాఖ అంటేనే పర్యాటక( tourism), ఆతిథ్యనగరం. ఇక్కడకు వచ్చేందుకు పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే రుషికొండ నిర్మాణాలను పర్యాటక శాఖ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆదాయ వనరులు పెరగడమే కాకుండా పర్యాటకంగా విశాఖ అభివృద్ధి చెందుతుంది. ఆన్లైన్ లో ప్రజాభిప్రాయాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం.. త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి..రుషికొండ నిర్మాణాలపై ఒక తుది నిర్ణయానికి రానుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఆ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికైతే రుషికొండ భవనాల వినియోగం అలా చేస్తారన్నమాట.

Dahagam Srinivas
Dahagam Srinivashttps://oktelugu.com/
Dahagam Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Politics, Sports, Cinema, General, Business. He covers all kind of All kind of news content in our website.

Most Popular

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Oktelugu Epaper
Exit mobile version