చిరును కలిసిన పూరి… సినిమా కోసమేనా?

రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకడు. ఆర్జీవీ తాలూకు భావజాలం పూరిలో చాలా ఎక్కువే ఉంటుంది. రాము మాదిరిగా సెన్సేషనల్‌ డైరెక్టర్గా ఎదిగాడు పూరి. అతి తక్కువ కాలంలో టాప్‌ హీరోలందరితో సినిమాలు చేశాడు. దానికంటే చాలా మందిని స్టార్లను చేశాడని చెప్పొచ్చు. ఆర్జీవీ మాదిరిగానే చాన్నాళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు. కానీ, తనదైన స్టయిల్లో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. ఇస్మార్ట్‌ శంకర్తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ […]

Written By: Neelambaram, Updated On : July 23, 2020 8:14 pm
Follow us on

రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకడు. ఆర్జీవీ తాలూకు భావజాలం పూరిలో చాలా ఎక్కువే ఉంటుంది. రాము మాదిరిగా సెన్సేషనల్‌ డైరెక్టర్గా ఎదిగాడు పూరి. అతి తక్కువ కాలంలో టాప్‌ హీరోలందరితో సినిమాలు చేశాడు. దానికంటే చాలా మందిని స్టార్లను చేశాడని చెప్పొచ్చు. ఆర్జీవీ మాదిరిగానే చాన్నాళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు. కానీ, తనదైన స్టయిల్లో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. ఇస్మార్ట్‌ శంకర్తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నాడు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ చూసిన పూరి కెరీర్లో ఓ లోటుంది. ఏకంగా బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను డైరెక్ట్‌ చేసిన జగన్‌…

Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో మాత్రం కలిసి పని చేయలేకపోయాడు. చాలా ఏళ్ల నుంచి చిరుతో మూవీ చేయాలని అతను చేయని ప్రయత్నం లేదు. తను ఫుల్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు చిరుతో ప్రాజెక్ట్‌ ఓకే అయినట్టు వార్తలు వచ్చినా.. అవి పట్టాలెక్కలేకయాయి. జగన్‌ స్టామినా తెలిసిన చిరు.. తన రీఎంట్రీ, 150వ మూవీని అతనితో చేయాలని అనుకున్నాడు. కథ రెడీ చేయమని కూడా చెప్పాడు. దాంతో, ఉబ్బితబ్బిబ్బైన పూరి.. ముఠామేస్త్రీ లాంటి కథతో ‘ఆటో జానీ’ స్ర్కిప్టు వినిపించాడు. సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేయమంటే చేసి మళ్లీ వినిపించాడు.

కానీ, రీఎంట్రీ టైమ్‌లో ప్రయోగాలు ఎందుకని భావించిన చిరు.. సేఫ్‌సైడ్‌గా తమిళ హిట్‌ మూవీ ‘కత్తి’ని ఎంచుకున్నాడు. ఖైదీ నం.150గా రీమేక్ చేసి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆటోజానీ ని రిజెక్ట్‌ చేసిన విషయాన్ని చిరు తనతో నేరుగా చెప్పలేని పూరి మీడియా ముందే వెల్లడించాడు. అయినా సరే తన అభిమాన హీరోతో సినిమా చేస్తానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇస్మార్ట్‌ శంకర్తో బ్లాక్‌బస్టర్ కొట్టి తన సత్తా మరోసారి చాటుకున్న పూరికి మెగా కాంపౌండ్‌ నుంచి పిలుపొచ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోవడంతో తన తదుపరి సినిమాలపై చిరు దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కథ రెడీ చేసుకొమ్మని పూరికి చెప్పాడట.

Also Read: నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..

దాంతో, రీసెంట్‌గా పూరి… మెగాస్టార్ ఇంటికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ చెప్పేందుకే పూరి… చిరును కలిశాడని టాక్‌. అయితే, మరిన్ని మార్పులు చేసిన ఆటోజానీ కథనే పూరి మరోసారి వినిపించాడా? లేదా కొత్త కథ చెప్పాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా చిరు, పూరి మీట్‌ అవడంతో ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ఓ క్రేజీ కాంబినేషన్‌ ఫ్యాన్స్‌ను అలరించడం పక్కా అనొచ్చు.