బిగ్ బాస్-4: ఆ ఇద్దరిలో ఒకరు విజేత..  కిరీటం వాళ్లకేనా?

  బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్-4 ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐదువారాలుగా కొనసాగుతున్న బిగ్ బాస్ కంటెస్టుల మధ్య గొడవలు పెట్టే టాస్కులు ఇస్తున్నాడు. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. తాజాగా జరిగిన హోటల్ టాస్క్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఊహించని ట్వీస్టులతో కంటెస్టులు హౌస్ లో ఆకట్టుకుంటున్నారు. Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ ! బిగ్ బాస్-4 షోకు ప్రస్తుతం మంచి స్పందన వస్తోంది. దీనిని ఇలానే కొనసాగించాలని […]

Written By: NARESH, Updated On : October 11, 2020 3:33 pm
Follow us on

 

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్-4 ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐదువారాలుగా కొనసాగుతున్న బిగ్ బాస్ కంటెస్టుల మధ్య గొడవలు పెట్టే టాస్కులు ఇస్తున్నాడు. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. తాజాగా జరిగిన హోటల్ టాస్క్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఊహించని ట్వీస్టులతో కంటెస్టులు హౌస్ లో ఆకట్టుకుంటున్నారు.

Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ !

బిగ్ బాస్-4 షోకు ప్రస్తుతం మంచి స్పందన వస్తోంది. దీనిని ఇలానే కొనసాగించాలని బిగ్ బాస్ నిర్వాహాకులు ప్లాన్ చేస్తున్నారు. షోపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి ముందస్తు లీకులు మొదలవుతున్నాయి. ఎలిమినేషన్ ఎవరు? అవుతారని ముందస్తుగానే ఆడియన్స్ గెస్ చేస్తున్నారు. దీంతో స్టార్ మానే ముందస్తు లీకులు ఇస్తూ ఎలిమినేషన్ పై ఇంట్రెస్టు పెంచుతోంది.

ఇక బిగ్ బాస్-4కు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఇద్దరు కంటెస్టులు వీరిద్దరు ఉంటారనే లీకులు బయటికి వస్తున్నాయి. టాప్ 5లో అభిజిత్.. సొహైల్.. అఖిల్.. నోవెల్.. అమ్మ రాజశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అభిజిత్.. సొహైల్ బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉంటారనే టాక్ విన్పిస్తోంది.

తాజాగా గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో తాజా ఎలిమినేషన్లో మార్పులు చేసుకునే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే 9మంది ఎలిమినేషన్స్ లో ఉండగా ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఎలిమినేషన్ లో అఖిల్, యాంకర్ లాస్య, సోహైల్, మోనాల్ గజ్జర్, హారిక, అరియానా, అమ్మా రాజశేఖర్, జోర్దార్ సుజాత ఉన్నారు. వీరిలో అఖిల్ నిన్న సేఫ్ జోన్లో ఉన్నట్లు తేలింది.

Also Read: అమితాబ్ పై అప్యాయతను చాటుకున్న చిరంజీవి

ఎవరికీ వారు టైటిల్ గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ప్రతీసారి బిగ్ బాస్ విన్నర్ గా మగవాళ్లే ఉంటున్నారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆడవారిపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈసారి కూడా టైటిల్ విన్నర్ మగవాళ్లే అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే బిగ్ బాస్ పై ట్రోలింగ్స్ మొదలైయ్యారు. ప్రస్తుత సీజన్లో లాస్య, హారిక, మోనాల్, అరియానా, దివి టైటిల్ కోసం పోరాడుతున్నారు. అయితే వీరికే టైటిల్ దక్కుతుందా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!