తెలుగులో నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ భామ

ప్రస్తుతం బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో భూమి పెడ్నేకర్ ఒకరు . ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఆరు సంవత్సరాలు కాస్టింగ్ డైరెక్టర్ వద్ద సహాయకురాలిగా పనిచేసి అనూహ్యంగా హీరోయిన్ గా అవకాశం దక్కించు కొంది. 2015 లో వచ్చిన ` దమ్ లగాకే హైష `చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించు కొంది. తొలి చిత్రం మంచి విజయం సాధించడం తో పాటు, ఉత్తమ నటిగా […]

Written By: admin, Updated On : April 24, 2020 6:01 pm
Follow us on


ప్రస్తుతం బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో భూమి పెడ్నేకర్ ఒకరు . ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఆరు సంవత్సరాలు కాస్టింగ్ డైరెక్టర్ వద్ద సహాయకురాలిగా పనిచేసి అనూహ్యంగా హీరోయిన్ గా అవకాశం దక్కించు కొంది. 2015 లో వచ్చిన ` దమ్ లగాకే హైష `చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించు కొంది. తొలి చిత్రం మంచి విజయం సాధించడం తో పాటు, ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. దాంతో నటిగా గుర్తింపు పెరిగి వరుస ఆఫర్లు దక్కించు కొంది. ఆ తరవాతి కాలం లో చేసిన ” టాయిలెట్ .. ఏక్ ప్రేమ కథ ,` శుభ మంగళ్ సావధాన్ ` ,` బాల `,` పతి పత్ని ఆర్ ఓహ్ “చిత్రాలు ఘన విజయాన్ని అందించాయి.

అలా బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు తెచ్చుకొన్న భూమి పెడ్నేకర్ బాలీవుడ్ మీడియా తో ముచ్చటిస్తూ తనకు దక్షిణ భారత భాషల్లో నటించాలని ఉంది.అన్న కోరిక వ్యక్త పరిచింది. మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో నటించాలని ఉంది అని మనసులో మాట బయట పెట్టింది. సంప్రదాయంగా కన్పించడం తో పాటు ,మంచి నటన సామర్ధ్యం కలిగి ఉన్న భూమి పెడ్నేకర్ కి తెలుగు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది . అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు .