
నందమూరి నటసింహం బాలక్రిష్ణ, ఆయన అన్న కొడుకు జూ.ఎన్టీఆర్ లు ఎడమొహం.. పెడమొహంగా ఉంటారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కలుసుకున్నా వీరిద్దరూ పెద్దగా ఆప్యాయత అనురాగాలు పంచుకున్న సీన్లు స్టేజీపై కనిపించవు. కానీ ఇప్పుడు అబ్బాయి-బాబాయ్ లు కలిసే సీన్ ఒకటి ఆవిష్కృతం కాబోతోందట..
సినిమాల్లో.. రాజకీయాల్లో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్ వారసులు.. అయితే కొన్నేళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా బాబాయ్ బాలక్రిష్ణ, అబ్బాయి జూ.ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. బాలయ్య, ఎన్టీఆర్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.
నందమూరి ఇంట ఓ పండుగ ఇప్పుడు బాబాయ్ అబ్బాయిని కలపబోతోందట.. ఈ పండుగకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నాడట.. అదే బాలయ్య షష్టిపూర్తి వేడుక.. నందమూరి ఫ్యామిలీలో దీన్ని ఘనంగా నిర్వహించబోతున్నారట.. మొత్తం నందమూరి హీరోలు , అన్నాదమ్ములంతా హాజరు కాబోతున్నట్టు తెలిసింది.
జూన్ 10న 60వ పడిలోకి బాలక్రిష్ణ అడుగుపెట్టబోతున్నారు. దీనిని పురస్కరించుకొని భారీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారట.. దీనికి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు , పురంధేశ్వరి సహా నందమూరి కుటుంబమంతా హాజరు కాబోతోందట..
సో ఈ వేడుకతో ఇక వివాదాలు, విభేదాలు నందమూరి ఇంట సమసిపోనున్నాయన్న మాట..