తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. పోలీస్ నియామక మండలి 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలు మల్టీజోన్ ఉద్యోగాలు కాగా రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
https://www.tslprb.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 151 పోస్టులలో మల్టీ జోన్ 1లో 68 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ 2లో 83 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎల్ఎల్బీ లేదా బీఎల్ చేసి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. మొత్తం రెండు పేపర్లు ఉండగా మొదటి పేపర్ లో 200 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున కేటాయించారు. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుందని సమాచారం.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంది. https://www.tslprb.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.