కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 115 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 22వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం.
http://www.ssbrectt.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఇంటర్ పాసై హిందీలో 30 పదాలు ఇంగ్లీష్ లో 35 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్లను బట్టి సడలింపులు ఉంటాయి. ఏడో పే కమిషన్లోని లెవెల్ 4 పే స్కేల్ ప్రకారం 25,500 రూపాయలు బేసిక్ శాలరీతో 81,100 రూపాయలు వేతనంగా లభిస్తుంది. స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు మాత్రం 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.