Homeఎడ్యుకేషన్బీటెక్ తో 511 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.50,000 వేతనంతో..?

బీటెక్ తో 511 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.50,000 వేతనంతో..?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 511 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ట్రైనీ ఇంజనీర్ అండ్‌ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 15వ తేది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 511 ఉద్యోగ ఖాళీలలో ట్రైనీ ఇంజనీర్ విభాగంలో 308 ఉద్యోగ ఖాళీలు ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 203 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఫ్రెషర్ అభ్యర్థులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రైనీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు తొలి ఏడాది 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఆ తర్వాత ఏడాదికి 3,000 రూపాయల చొప్పున వేతనం పెరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35,000 రూపాయల నుంచి వేతనం లభిస్తుంది. ఏడాదికి 5,000 రూపాయల వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకొవాల్సి ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 500 రూపాయలు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version