టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా రిలీజైన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 20 ఉద్యోగ ఖాళీలు ఉండగా నావీ ముంబైలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. https://actrec.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
27 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం నవంబర్ నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా మంచి ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.
వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులభంగా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.