యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన దగ్గర నుండి తారక్ అభిమానుల ఆందోళనలో ఉన్నారు. ఐతే, గత కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్, మొత్తానికి కరోనాని జయించాడు. తన ఆరోగ్యం పై కలత చెందిన అభిమానులకు ఎన్టీఆర్ శుభవార్త చెప్పాడు. కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకున్నానంటూ తారక్ తన అభిమానులకు అఫీషియల్ గా ఒక పోస్ట్ పెట్టాడు.
ఎన్టీఆర్ మాటల్లో ఫైనల్ గా నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆరోగ్యం పై స్పెషల్ కేర్ తీసుకున్న డాక్టర్లకు కూడా స్పెషల్ థాంక్స్. అంటూ పోస్ట్ చేసాడు. ఇక అందరూ జాగ్రత్తలు పాటించండి అని తారక్ తెలుపుతూనే కొన్ని జాగ్రత్తలు తెలియజేశాడు.
ఈ కరోనా మహమ్మారిని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే, అయితే, అదే సమయంలో ఒక పాజిటివ్ మైండ్ తో ఉండాలి. కరోనా పై ముందు నుండి జాగ్రత్తలు పాటిస్తూ కేర్ తీసుకున్నట్లయితే దానిని ప్రతిఒక్కరూ సులభంగా జయించవచ్చు’ అంటూ తారక్ ప్రేక్షకులకు సూచిస్తూ.. మన మనోధైర్యమే పెద్ద ఆయుధమని, దయచేసి కరోనా వచ్చినప్పుడు ఎవరూ కంగారు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ కోరాడు.
అసలు, ఎన్టీఆర్ కి కరోనా రావడానికి కారణం.. గత నెలలో ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ ఒక పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీకి వెళ్లిన చాలా మందికి కరోనా సోకింది. వారి వల్లే ఎన్టీఆర్ కి కూడా కరోనా సోకిందని, అలా ఎన్టీఆర్ నుండి ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరోనా వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనాని జయించి తారక్, తన అభిమానులకు శుభవార్త తెలిపాడు.
https://twitter.com/tarak9999/status/1397046322088222725?s=21