Homeబిజినెస్Top 5 electric scooters: మార్కెట్లో ఇప్పుడు ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 5 electric scooters: మార్కెట్లో ఇప్పుడు ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 5 electric scooters: వినియోగదారుల అభివృద్ధిలో మారుతుండడంతో ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటాలనే వాడుతున్నారు. కొన్ని కంపెనీలు వీటిని తక్కువ ధరకు అందించడంతోపాటు.. కావలసిన సౌకర్యాలను ఇస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు స్పోర్ట్స్ బైక్ లను అందించిన కంపెనీలు సైతం స్కూటర్ లనే ఎక్కువగా తీసుకువస్తున్నారు. అయితే ఏ కంపెనీ స్కూటర్ కొనాలని కొంతమందికి సందేహం ఉంటుంది. ఇలాంటి వారికి ప్రస్తుతం ఉన్న టాప్ స్కూటర్లు ఏవో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ టూవీలర్ కంపెనీ TVS మార్కెట్లోకి వచ్చిన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యధిక విక్రయాలు నమోదు చేసుకుంటుంది. ఈ స్కూటర్ ఈ ఏడాది మార్చిలో 49,453 యూనిట్ల విక్రయాలు చేసుకుంది. దీనిని రూ.1.61 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇందులో 5.3 కిలోవాట్ బ్యాటరీ ట్యాంక్ ఉండగా దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చే Ather నుంచి మార్కెట్లోకి వచ్చిన Rizta ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ఇందులో ఉండే ఫీచర్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్లో 4.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. దీనిని ఒక్కసారి చేస్తే 123 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో స్థిరత్వం కోసం స్పీడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే నేటితరం వినియోగదారులను ఆకట్టుకునేలా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, వాట్సాప్ ప్రివ్యూ, లైవ్ లొకేషన్, మ్యాజిక్ ట్విస్ట్ వంటి ఫీచర్లను చూడొచ్చు. దీనిని రూ.1.04 లక్షల ప్రారంభ ధరలతో విక్రయిస్తున్నారు.

Bajaj కంపెనీకి చెందిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా అవతరించి వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దీని డిజైన్ చూస్తే వెంటనే కొనాలని అనిపిస్తుంది. మిగతా స్కూటర్ల కంటే ఇది భిన్నంగా కనిపిస్తూ ప్రీమియం లుక్ ను అందిస్తుంది. అంతేకాకుండా దీని ధర మిగతా వాటికంటే తక్కువగానే ఉంటుంది. ఈ స్కూటర్లు రూ. 89,500 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

SUZUKI కంపెనీకి చెందిన యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్కు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.1.88 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్లో 3.07 బ్యాటరీ ప్యాక్ ఉండగా దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

OLA కంపెనీకి చెందిన S1 pro జెన్ 3 అనే స్కూటర్ కూడా అందరిని అలరిస్తోంది. ఇందులో 3 కిలో వాట్ బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ.1.02 లక్షలతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular