టీడీపీ నేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడంట భవిష్యత్లో ఎవరూ నమ్మరని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. విశాఖలో వందల కోట్ల భూమిని ఆక్రమించి నిర్మించిన గీతం యూనివర్సిటీని కూల్చేయ్యద్దంటే ఎలా అని ప్రశ్నించారు. తమ బంధువులకు ఇలా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించడం సరైన పనేనా..? అని అడిగారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ఇలా బంధువులకు భూములు ఇప్పిస్తే వారేమవుతారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.