దేవాలయాలపై దాడుల విషయంలో అత్యవసర భేటీ

ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యవసర భేటీ నిర్వహించారు. శనివారం అధికారులతో ఆయన ఈ విషయంపై చర్చిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అంతర్వేది ఘటన నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థ ఆలయంలో జరిగిన దాడులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామతీర్థంలోని బోడికొండపై ఏర్పాటు చేసిన రాముడి విగ్రహం ధ్వంసంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రామతీర్థానికి వచ్చారు. అటు […]

Written By: Suresh, Updated On : January 2, 2021 4:07 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యవసర భేటీ నిర్వహించారు. శనివారం అధికారులతో ఆయన ఈ విషయంపై చర్చిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అంతర్వేది ఘటన నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థ ఆలయంలో జరిగిన దాడులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామతీర్థంలోని బోడికొండపై ఏర్పాటు చేసిన రాముడి విగ్రహం ధ్వంసంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రామతీర్థానికి వచ్చారు. అటు అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చర్చిస్తోంది.