spot_img
Homeక్రీడలుటీమిండియాకు అభిమాని సర్‌‌ప్రైజ్‌

టీమిండియాకు అభిమాని సర్‌‌ప్రైజ్‌

Team India Cricketers
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌‌లో ఉంది. ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఓ అభిమాని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆటగాళ్లు అతడికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు రోహిత్‌, పంత్‌, గిల్‌, సైని లంచ్‌కు వెళ్లారు. భారత్‌కు చెందిన నవల్దీప్ సింగ్‌ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. జనవరి 1న అతడు ఓ హోటల్‌కు వెళ్లగా రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ గిల్‌ తన ముందు టేబుల్‌లో కూర్చున్నారు. వారిని చూసి తెగ ఆనందపడిపోయిన నవల్దీప్.. సీక్రెట్‌గా వారి లంచ్ బిల్లు చెల్లించేశాడు.

Also Read: టెస్టుల్లోకి నటరాజన్.. వైస్ కెప్టెన్ గా రోహిత్

ఈ విషయం తెలియక క్రికెటర్లు సైతం తమ బిల్‌ చెల్లించేందుకు వెళ్లారు. అయితే ‘మీ టేబుల్‌ వెనుక కూర్చున్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి బిల్లును కట్టేశార’ని హోటల్‌ సిబ్బంది చెప్పారు. దీంతో మన క్రికెటర్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. తాము బిల్ కడతామని, వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ..ఇందుకు నవల్దీప్‌ ఒప్పుకోలేదు. అది తన గిఫ్ట్ లాగా చూడండని కోరాడు. దీంతో భారత ఆటగాళ్లు కూడా అతడిని హగ్ చేసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు.

Also Read: రోహిత్‌ ఇన్‌.. విహారీ ఔట్‌..!

దీనిపై నవల్దీప్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘నేను బిల్లును చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. నా సూపర్‌స్టార్స్‌ కోసం ఆ మాత్రం చేయలేనా!’ అని ట్వీట్‌ చేశాడు. దాన్ని రీట్వీట్ చేస్తూ..‘బిల్లు కట్టానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి.. ‘బ్రదర్‌.. డబ్బులు తీసుకో. మీరు చెల్లించడం బాగోద’ని అన్నాడు. ఆ తర్వాత పంత్‌ హగ్‌ చేసుకున్నాడు. అందరం కలిసి ఓ ఫొటో తీసుకున్నాం’ అని పోస్ట్‌ చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఆసిస్ చెరొకటి గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఇక సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అలాగే రోహిత్ ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకుని టీమిండియాతో చేరాడు. మూడో టెస్టులో అతడు కూడా ఆడనున్నాడు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version