Ashok Gajapathi Raju: రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతలా ఉంటుంది అక్కడ పరిస్థితి. పూసపాటి అశోక్ గజపతిరాజు సంప్రదాయ రాజకీయాలను నమ్ముకున్నారు. కానీ పొలిటికల్ గా బొత్స ఫ్యామిలీ ఎంట్రీ తో అక్కడ సీన్ మారింది. బొత్స ఫ్యామిలీ దూకుడు రాజకీయాలు చేస్తూ వచ్చింది. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం ఆ పాత రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజుగారు గవర్నర్గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాను ఒక వ్యక్తిని అని.. తన ఆస్తులను బలవంతంగా లాక్కోవాలని భావిస్తే ప్రశ్నించవద్ద అని ప్రశ్నిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఇటీవల జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన.. విజయనగరంలోనే ఉంటూనే వైసీపీ పై గట్టి ఆరోపణలు చేశారు. ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
* అశోక్ గజపతిరాజు ఫిర్యాదు ..
పూసపాటి రాజవంశీయుడిగా.. విజయనగరం సంస్థానానికి అధినేతగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. ఆ కుటుంబానికి ఉన్న వేలాది ఎకరాల ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం విడిచిపెట్టిన గొప్ప మనసు వారిది. అందుకే విజయనగరం జిల్లా ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజుకు గౌరవం ఇస్తారు. రాజుగారు కూడా తన బంగ్లాను టిడిపి కార్యాలయంగా మార్చి సేవలందిస్తూ వచ్చారు. అందుకే కాబోలు వైసిపి అదే రాజవంశీయుల ప్రైవేటు భూమిని పార్టీ కార్యాలయం కోసం లీజుకు రాయించుకుంది. ఇప్పుడు దాని పైనే పెద్ద యుద్ధం చేస్తున్నారు అశోక్ గజపతిరాజు. తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ స్థలం ఎకరా భూమిని వైసీపీ కార్యాలయ భవనం కోసం లీజుకు ఇవ్వడాన్ని తప్పుపడుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
* ప్రభుత్వ భూమి గా మార్చేసి..
గత కొద్ది రోజులుగా దీనిపై వివాదం నడుస్తోంది. వందల సంవత్సరాల క్రితం రాజవంశీల ప్రైవేటు భూమిగా రికార్డుల్లో ఉంది. అదే భూమిని ప్రభుత్వ భూమి గా మార్చి.. ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం కోసం 33 సంవత్సరాల లీజుకు ఇచ్చేశారు. దీనిపైన ఇప్పుడు అశోక్ గజపతిరాజు పోరాటం చేస్తున్నారు. గత మూడు రోజులుగా దీనినే హైలెట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడంతో యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటుంది. కచ్చితంగా వైసీపీ భవనాన్ని ఖాళీ చేస్తారు అని తెలుస్తోంది. అదే జరిగితే ఆ పార్టీకి అది ఎంతో అవమానకరం.
