YS Sharmila: తెలంగాణలో వైఎస్.షర్మిల రెండేళ్ల క్రితం స్థాపించిన వైఎస్సార్టీపీని గురువారం కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేయడంతోపాటు షర్మిల కాంగ్రెస్లో చేరారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు.
గర్వంగా ఉందని..
కాంగ్రెస్తో చేరినందుకు తనక ఎంతో గర్వంగా ఉందని షర్మిల తెలిపారు. బుధవారం నుంచి వైఎస్సార్ టీపీ కాంగ్రెస్లో భాగమే అని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తానన్నారు. దివంగత నేత వైఎస్సార్ కల రాహుల్ప్రధాని కావడమే అని దాని కోసం తాను కూడా కష్టపడతానని తెలిపారు. దేశంలో సెక్యూలర్ పార్టీ అధికారంలో లేనందునే మణిపూర్లో అల్లర్లు జపరిగాయని తెలిపారు.
అండమాన్లో అయినా పనిచేస్తా..
తను ఇక కాంగ్రెస్ కార్యకర్తనని, అధిష్టానం ఏ పని చేయమంటే అది చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అయినా.. అండమాన్లో అయినా పని చేయడానికి సిద్దమని షర్మిల ప్రకటించారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని మరోమారు వెల్లడించారు.
కండువా కప్పుకోని అనిల్..
అంతకుముందు షర్మిల తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరారు. అయితే ఈ సందర్భంగా అనిల్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అనుకున్నారు. కానీ అనిల్ పార్టీ కవండు కప్పుకోకపోవడం గమనార్హం. షర్మిల పార్టీలో చేరిన తర్వాత అనిల్తో కలిసి సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. సోనియాను కలిశారు.
కాంగ్రెస్ పార్టీ అండమాన్లో పని చెయ్యమన్నా చేస్తా – వైఎస్ షర్మిల pic.twitter.com/SJxesKybfv
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2024