Nara Lokesh: నారా లోకేష్ పాత్ర ఏంటి?

2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ అందరితో పాటు ఆయన ఒక మంత్రి మాత్రమే. అటు డైరెక్ట్ ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ను.. క్యాబినెట్ లోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.

Written By: Dharma, Updated On : June 7, 2024 10:32 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఏపీలో కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ పాత్ర ఏంటి? క్యాబినెట్లో చేరతారా? లేకుంటే పార్టీ పగ్గాలు తీసుకుంటారా? అసలు చంద్రబాబు మదిలో ఏముంది? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్న ఆ మధ్యన బుద్ధ వెంకన్న టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్పగించాలని కోరారు. ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్ కు వీర విధేయుడు. వారి అనుమతి లేకుండా అలా మాట్లాడి ఉంటారా అన్నది ఒక రకమైన అనుమానం. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఒక్క పార్టీ పగ్గాలు అందిస్తే సరిపోదని.. ప్రభుత్వంలో సైతం భాగస్వామ్యం అప్పగిస్తేనే లోకేష్ భవిష్యత్తుకు బాగుంటుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ అందరితో పాటు ఆయన ఒక మంత్రి మాత్రమే. అటు డైరెక్ట్ ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ను.. క్యాబినెట్ లోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పార్టీపై అంతగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అందుకే ఈసారి లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే కేవలం పార్టీ పగ్గాలు అందిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని.. మంత్రి హోదా తో పాటు చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్లు పదవి ఇస్తేనే ప్రయోజనమని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

లోకేష్ విషయంలో విపక్షాలు మారు మాట చెప్పే అవకాశం లేదు. గతం మాదిరిగా దొడ్డిదారిన వచ్చారని ఆరోపించడానికి వీలు లేదు. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా 90 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఏకపక్ష విజయం సాధించారు. అసలు టిడిపి గెలవలేని నియోజకవర్గంలో సత్తా చాటారు. అందుకే ఆయనకు పార్టీ పగ్గాలు అందించేందుకు ఇదే కరెక్ట్ సమయం. అదే సమయంలో కీలక మంత్రి పదవితో పాటు డిప్యూటీసీఎం హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అటు పార్టీని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.