spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Mahanadu : గోదావరి తీరం పసుపు శోభితం..

TDP Mahanadu : గోదావరి తీరం పసుపు శోభితం..

TDP Mahanadu : గోదావరి తీరం పసుపు వర్ణిత శోభితంగా మారింది.తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు రాజమండ్రి సిద్ధమైంది. మహానాడు ఏర్పాట్లతో నగరం కళకళలాడుతోంది. ఎన్నికల చివరి ఏడాది కావడంతో కేడర్ కు దిశ నిర్దేశం చేసేందుకు మహానాడు వేదిక కానుంది. పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశాయి. సంక్షేమానికి సంబంధించి మేనిఫెస్టో, పొత్తుల అంశంతో పాటు కీలక అంశాలపై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. అటు లోకేష్ యుగళం పాదయాత్రకు తాత్కాలికంగా నిలిపివేసి మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

రాజమండ్రి నగరమంతా పసుపు వర్ణమాలతో నిండిపోయింది. దారిపొడవునా ఫ్లెక్సీలు, స్వాగత బోర్డులతో కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రానికే తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ శ్రేణులు రాజమండ్రి నగరానికి చేరుకున్నాయి. దీంతో హోటళ్లు, లాడ్జిలు కిటకిటలాడుతూ కనిపించాయి. కొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. అటు రాజమండ్రి నగరానికి వాహన రద్దీ కూడా పెరిగింది. దాదాపు అన్ని రహదారులు వాహనాలతో బారులుదీరుతూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ అలెర్టయ్యింది. దాదాపు 1200 మంది సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహిస్తోంది.

అయితే ఇప్పటివరకూ నిర్వహించిన మహానాడులకు ఇది భిన్నం. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను సైతం ఏర్పాటుచేయనున్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. మహానాడులో మొత్తం ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉరకలేసిన ఉత్సాహంతో మహానాడుకు టీడీపీ శ్రేణులు తరలి రావడంతో నాయకత్వంలో కొత్త జోష్ నెలకొంది. మరోవైపు మహానాడుకు రాకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా టీడీపీ శ్రేణులు సొంత వాహనాలతో చేరుకోవడం కనిపిస్తోంది. గత మహానాడును ఒంగోలులో నిర్వహించారు. అప్పటి వరకూ ఎంతో నిరాశగా ఉన్న క్యాడర్..ఒంగోలు మహానాడుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసినప్పటి నుండి ఓపిక తెచ్చుకుంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. అప్పట్నుంచి జనంలోనే ఉన్న టీడీపీ.. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ మహానాడు తర్వాత ఇక టీడీపీ పూర్తి స్థాయి ఎన్నికల మూడ్ లోనే ఉండనుంది. అందుకే ఆ దిశగా దిశ నిర్దేశం చేసేందుకు టీడీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version