Homeఆంధ్రప్రదేశ్‌TDP: ఆ టీం అంటేనే దడుచుకుంటున్న టిడిపి

TDP: ఆ టీం అంటేనే దడుచుకుంటున్న టిడిపి

TDP: సాధారణంగా అధికారులపై రాజకీయ విమర్శలు రావడం సహజం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి వారిపై ఫిర్యాదులు వస్తాయి. అయితే ఏపీలో మాత్రం ఈ లెక్కకు మించి ఉన్నతాధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముంగిట అధికారులపై ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ సైతం సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటలిజెన్స్, విజిలెన్స్ విభాగాల అధికారులపై ఈసీ వేటు వేయడం ఖాయంగా తేలుతోంది. వారి ప్రవర్తన తీరు అభ్యంతరకరంగా ఉండడం, విపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఈసీ పై ఏర్పడింది.

ఇప్పటికే చాలామంది అధికారులపై ఈసీ వేటు వేసింది. ఈ జాబితాలో కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదుకు సహకరించారని చాలామంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి సైతం పక్కకు తప్పించే అవకాశం ఉంది. వాస్తవానికి ఆయన రెగ్యులర్ డిజిపి కాదు. కేవలం ఇంచార్జ్ తోనే కొనసాగిస్తూ వచ్చారు. రెగ్యులర్ డిజిపిగా ఆయనకు అర్హత లేదు. ఆయనకంటే సీనియారిటీ ఉన్న పదిమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఎక్కడో 11 నెంబర్ తో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ని డిజిపి కుర్చీలో కూర్చోబెట్టారు.ఎన్నికల సమయంలో ఇంచార్జ్కి ఒప్పుకునే స్థితిలో ఈసీ లేదు. అందుకే రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తి రానున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంగతి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ కు అత్యంత విధేయుడు. తాజాగా పెన్షన్ వివాదంలో అధికార పార్టీకిఅనుకూలంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది.ఆయన తీరుతోనే పెన్షన్లు ఆలస్యం అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది.ఎన్నికల్లో ఆయన ఉంటే.. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగదని టిడిపి ఆరోపిస్తోంది. ఆయనను మార్చేయాలని కోరుతోంది. కచ్చితంగా ఈసీ మార్పు చేస్తుందని టిడిపి ఆశిస్తోంది. మరోవైపు ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గురించి చెప్పనవసరం లేదు.ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ఉండాలో అన్నీ ఉన్నాయి.చంద్రబాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.దీనిపై వర్ల రామయ్య నేరుగా ఫిర్యాదులు చేశారు. మరోవైపు విజిలెన్స్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వీరంతా ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఈ టీంను మార్చాలని టిడిపి పట్టుబడుతోంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
Oktelugu Epaper
Exit mobile version