TDP: ఆ జిల్లాలో వైసీపీని ఫాలో అయిన టిడిపి

గతంలో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో అనిల్ కు టికెట్ దక్కలేదు.

Written By: Dharma, Updated On : June 15, 2024 4:48 pm

TDP

Follow us on

TDP: వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ దే విజయం. 2019 ఎన్నికల్లో అయితే ఆ పార్టీ వైట్ వాష్ చేసింది. పదికి పది నియోజకవర్గాలను సొంతం చేసుకుంది. అయితే ఆ రికార్డును ఈసారి టిడిపి కూటమి బ్రేక్ వేసింది. ఈ ఎన్నికల్లో టిడిపి క్లీన్ స్లీప్ చేసింది. గత ఎన్నికల్లో గెలిచిన వైసిపి ఈ జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయించింది. ఇప్పుడు అదే పరంపరను కొనసాగించింది టిడిపి కూటమి. అయితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ దక్కిన రెండు మంత్రి పదవులు అవే స్థానాలు కావడం విశేషం.

గతంలో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో అనిల్ కు టికెట్ దక్కలేదు. నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అదే నెల్లూరు సిటీ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పొంగూరు నారాయణ విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. మునిసిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక ఆత్మకూరు నుంచి గతంలో మేకపాటి గౌతంరెడ్డి గెలిచారు. ఆయన జగన్ క్యాబినెట్లో గెలుపొందారు. కానీ అకాల మరణం చెందారు. ఎన్నికల్లో ఆయన సోదరుడు పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి బరిలో దిగి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గతంలో వైసిపి హయాంలో ఏ నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కాయో.. ఇప్పుడు టిడిపి హయాంలో అవే నియోజకవర్గాలకు దక్కడం విశేషం.

అయితే ఇది యాదృచ్ఛికమే అయినా.. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇందులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదు ప్రయత్నాల్లో ఓటమి చెంది.. ఆరో ప్రయత్నంలో గెలిచారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డికి క్యాబినెట్లో చోటిచ్చారు చంద్రబాబు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినా అవకాశం ఇవ్వలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. వైసీపీలో పదవీకాలం ఉండగానే నాయకత్వాన్ని విభేదించారు. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. ఆయన సేవలను గుర్తించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. కనీసం విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నారు.