Talliki Vandanam Scheme: లక్షలాది మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ పధకం డబ్బులను ఈ నెల 22 న విడుదల చేయబోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 67,47,190 మంది విద్యార్థులకు ఈ పధకం అందనుంది. ఆ విద్యార్థుల తల్లులు దాదాపుగా 42,70,902 మంది ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో 13000 రూపాయిలు జామకానుంది. మిగిలిన రెండు వేల రూపాయిలు స్కూల్ అభివృద్ధి కి ఉపయోగించనున్నారు. దాదాపుగా 10 వేల కోట్ల నిధులను మంజూరు చేయనున్నారు. ఈ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా మీ అకౌంట్స్ లో జమ కావాలంటే , మీ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్ గా ఉండాలి , అది ఆధార్ కార్డు తో లింక్ అయ్యి ఉండాలి. ఇదంతా పక్కన పెడితే ఈ పధకానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ విద్య సంవత్సరం లో కొత్తగా చేరిన విద్యార్థులు, పాఠశాల మారి 9 వ తరగతి లో చేరిన విద్యాదులు , 10 వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరిన విద్యార్థుల నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతోంది. అధికారులు వీళ్ళ డేటా ని పూర్తిగా పరీక్షించిన తర్వాత ఆగస్టు 30 వ తేదీన ఆయా విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు తమకు ‘తల్లికి వందనం’ డబ్బులు దక్కవేమో అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ క్యాటగిరీ విద్యార్థులు కాస్త ఊపిరి తీసుకున్నారు. కాకపోతే ఒక నెలరోజులు ఎదురు చూడాలంతే. గత ఏడాది కంటే ఈ ఏడాది ‘తల్లికి వందనం’ నిధులు ఎక్కువగా విడుదల చేయబోతుంది కూటమి ప్రభుత్వం.
గత ఏడాది 9 వేల కోట్లు విడుదల చేయగా, ఈ ఏడాది ఏకంగా 10 వేల కోట్ల రూపాయిల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా ఒక సభ ని ఏర్పాటు చేసి , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆద్వర్యం లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది. ‘తల్లికి వందనం’ పథకం పై మాజీ సీఎం జగన్, వైసీపీ కార్యకర్తలు ఏ రేంజ్ లో వెటకారం చేసేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాజీ సీఎం జగన్ కుటుంబం లో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకం డబ్బులు అందించగా, కూటమి ప్రభుత్వం కుటుంబం లో ఎంతమంది ఉంటే అంత మందికి అందిస్తున్నారు.
