spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rushikonda Palace: అమ్మకానికి రుషికొండ ప్యాలెస్.. కొనుగోలుకు ఓ వ్యక్తి ఆసక్తి

Rushikonda Palace: అమ్మకానికి రుషికొండ ప్యాలెస్.. కొనుగోలుకు ఓ వ్యక్తి ఆసక్తి

Rushikonda Palace: రుషికొండలో వైసీపీ సర్కార్ అద్భుత కట్టడాలు నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని నిర్మించినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రతి నిర్మాణం అద్భుతమే. దీనిపై అధికార ప్రతిపక్షం మధ్య రచ్చ కొనసాగుతుండగా.. ఎలా వాడుకోవాలన్నది చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా ఈ ప్యాలెస్ ను తాను కొనుగోలు చేస్తానని సుకేష్ చంద్ర ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. అంతేకాదు తాను పంపిస్తున్న ఈ లేఖను ఒప్పందంగా భావించాలి అని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ ప్యాలెస్ కు ఎంత ధర పెట్టినా దానిపై 20 శాతం చొప్పున అదనంగా తాను చెల్లించి కొనుగోలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ అమ్మడం ఇష్టం లేకుంటే కనీసం లీజుకు ఇవ్వాలని కోరారు.

అయితే ఇప్పుడు సుఖేష్ చంద్ర ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ కుంభకోణం నిందితుల్లో సుఖేష్ చంద్ర ఒకరు. మనీ లాండరింగ్ కేసులు ఆయనను ఈడి అరెస్టు చేసింది. ఆయన జైలు నుంచే తీవ్ర వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ.. రాజకీయంగా దుమారం రేపుతున్నారు. తాజాగా రుషికొండ ప్యాలెస్ కొనుగోలు చేస్తానని.. తనకు మాత్రమే అమ్మాలని నేరుగా సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాయడం విశేషం. అంతటితో ఆగకుండా ఆయన తనకు విశాఖ తో అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. బాల్యం ఎక్కువగా విశాఖలో గడిచింది అన్నారు. విశాఖ తో పాటు ఆర్కే బీచ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని లేఖలో వివరించారు.

రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ వాస్తవాలు దాచింది. ఆ నిర్మాణాలు ఎందుకు చేపట్టారో బయటకు వెల్లడించలేదు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అన్న విమర్శ ఉంది. పర్యాటక చరిత్ర ఉన్న భవనాలను తొలగించి 500 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మూడంచెల భద్రత వ్యవస్థ నడుమ రుషికొండ నిర్మాణాలు సాగాయి. అటువైపుగా కాకి వాళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ నిర్మాణాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలామందిని తీసుకెళ్లి రుషికొండ నిర్మాణాలను బయటపెట్టారు. అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే సుఖేష్ చంద్ర ఈ లేఖ రాశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version