Pawan Kalyan: తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని చెబుతారు పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ). నిజాయితీగా రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చారు. డబ్బుతో రాజకీయాలు చేయలేమని తేల్చి చెప్పారు. తన సొంత డబ్బులతోనే రాజకీయం చేస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు. పార్టీ కోసం తాను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని కూడా అనేక సందర్భాల్లో వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. రాజకీయాలు నడిపించినంత డబ్బు ఎక్కడిది? ఈ పదేళ్లపాటు సినిమాల ద్వారా వచ్చిన సొమ్ముతోనే పార్టీని నడిపారా? అందులో నిజం ఎంత? నమ్మడానికి ఏమైనా వీలుందా? వంటి ప్రశ్నలు సంధిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Also Read: తిరుపతిలో హై టెన్షన్.. గోశాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు.. బయలుదేరిన కరుణాకర్ రెడ్డి!
* ఆరు సినిమాల్లో నటించి ఎలా..
తాజాగా ఇదే విషయంపై వైసీపీ నేత పోతిన మహేష్( pothina Mahesh) మీడియాతో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. 2014 నుంచి 2024 మధ్య పవన్ కళ్యాణ్ కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించారని చెప్పుకొచ్చారు. ఆయన రెమ్యూనరేషన్ ఎంత? సినిమాలకు ఎంత తీసుకుంటున్నారు? ఎంత ఖర్చు చేశారు? పార్టీని ఎలా నడిపించారు? వీటన్నింటిపై త్వరలో లెక్కల తో సహా బయట పెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా సంపాదనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది.
* జనాదరణ కలిగిన హీరో..
తెలుగులో అత్యంత జనాదారణ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందుంటారు. ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచినా ఆయన ఫేమ్ మాత్రం తగ్గలేదు. ఆయన కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. డిజాస్టర్ గా మిగిలినవి కూడా ఉన్నాయి. అయినా సరే ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టేవారు. అయితే 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ సినిమాలు తీయలేకపోయారు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీసేవారు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఉపయోగించేవారు. అయితే పార్టీని నడిపించే రేంజ్ లో పవన్ కళ్యాణ్ కు ఆదాయం వచ్చిందా? వస్తే ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* పోటీ చేసే అవకాశం లేక..
2024 ఎన్నికలకు ముందు వరకు జనసేనలో( janasena ) ఉండేవారు పోతిన మహేష్. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మంచి ఓట్లు సాధించారు. 2024 ఎన్నికల్లో జనసేన టికెట్ తనకే వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించారు. బిజెపి తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేసి గెలిచారు. అయితే టిక్కెట్ రాకపోవడంతో పోతిన మహేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. కానీ అక్కడ ఆ పార్టీ ఓడిపోవడంతో.. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అప్పటినుంచి అదే పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.
Also Read: 30 ఏఎంసీలకు కమిటీలు.. జనసేన కు ఛాన్స్.. బిజెపికి ఒకటి!